UP woman kidnapped, gang raped and sold మూడు రోజుల్లో పెళ్లి.. యువతి కిడ్నాప్ చేసి అమ్మెసిన దుండగులు

18 yr old woman kidnapped raped while distributing her wedding cards in up

18 yr old woman kidnapped in Uttar Pradesh, 18 year old kidnapped 3 days before marriage, 18 year old kidnapped while distributing wedding cards, 18 year old abducted, woman Kidnap from Uttar Pradesh, 18 year old woman sold to leader in Jhansi, 18 year old woman molested, 18 year old woman sexual assault, 18 yr old woman, wedding, distributing cars, abducted, sexual assault, sold to leader in Jhansi, uttar pradesh, Crime

An 18-year-old woman has alleged that she was kidnapped and raped by three men while she was distributing her wedding invitation cards in Uttar Pradesh. The woman also alleged that the accused took her to the leader of a political party and later forced her to live with someone else in a village in Datia district of Madhya Pradesh, police said.

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం.. మూడు రోజుల్లో పెళ్లి.. యువతి కిడ్నాప్ చేసి అమ్మెసిన దుండగులు

Posted: 05/10/2022 03:37 PM IST
18 yr old woman kidnapped raped while distributing her wedding cards in up

ఉత్తర్​ప్రదేశ్​​ రాష్ట్రంలో క్రైం రేట్ చాలా ఎక్కువ. ప్రతీరోజు ఈ రాష్ట్రంలోని ఏదో ఒక మూల రాష్ట్రానికి చెందిన ఆడపడచులు లైంగికదాడులను ఎదుర్కోవాల్సి వస్తూనేఉంది. ఇక తాజాగా ఈ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మూడు రోజుల వ్యవధిలో ఓ కన్నెపిల్ల కలలు నెరవేరనున్న రోజు. అమెను కన్న తల్లిదండ్రుల భారం తగ్గే రోజు. తమ కూతురి పెళ్లి నిశ్చయమై ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ తరుణంలో గ్రామంలోని కొందరు స్నేహితులకు, పరిచయస్థులకు పత్రికలు ఇచ్చేందుకు బయలుదేరిన యువతి కనిపించకుండా పోయింది.

మరో 72 గంట్లలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కనిపించకుండా పోవడంతో.. ఆ తల్లిదండ్రులు, అప్పటికే వారింటికి చేరిన బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పెళ్లి తంతు రద్దు అయ్యింది. అమ్మాయి కనిపించడం లేదని బంధుజనానికి కూడా చెప్పి వారిని తిప్పి పంచించేశారు. అయితే ఆ యువతిని వెంబడించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. అపహరించారు. కొన్న రోజుల పాటు తమ వద్దే బంధీగా ఉంచుకుని అమెపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుండగులు.. యువతిని ఓ నేతకు అమ్మేశారు. అతను కూడా యువతిపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ తరువాత మధ్యప్రదేశ్ కు తరలించాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది బాధితురాలు.

వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న ఓ యువతికి ఏప్రిల్​ 21న పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామంలో నివసించే బంధువులకు, మిత్రులకు పెళ్లి పత్రికలను ఇచ్చేందుకు ఏప్రిల్​ 18న ఇంటి నుంచి బయలుదేరింది. కాగా.. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను వెంబడించారు. అమె వెంట వెళ్లి ఎవరూ లేని సమయం కోసం వేచి చూసి.. ఆమెను అపహరించారు. అనంతరం అమెను ఓ నిర్ఝన ప్రదేశానికి తరలించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. కొన్ని రోజుల పాటు బాధితురాలిని ఆ ముగ్గురు వేరువేరు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.

అనంతరం ఝాన్సీలోని ఓ రాజకీయ నేతకు బాధితురాలని విక్రయించారు. దీంతో యువతిని ఓ ఇంట్లో బంధించిన నేత అమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆమెను మరొకరు.. దాతియాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. వేరే వ్యక్తి దగ్గర ఆమెను ఉంచారు. అక్కడ ఆమెకు ఫోన్​ లభించడంతో.. తన తండ్రికి ఫోన్​ చేసి విషయాన్ని చెప్పగా ఆయన. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాతారి గ్రామం నుంచి యువతిని పోలీసులు రక్షించారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు, బాధితురాలిని అపహరించి, అమ్మేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లభిస్తే.. నిందితులను కఠినంగా శిక్షించే యోచనలో వారున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles