అరబ్సు దేశాలలో సౌదీ అరేబియా షెరియా చట్టాన్ని అమలు చేస్తూ... కఠినమైన బహిరంగ శిక్షలను కూడా విధిస్తుంటుంది. దుబాయ్ లో పౌరులకు ఉన్నంత స్వేచ్ఛా సౌదీ అరేబియాలో పౌరులకు ఉండదు. అక్కడి మహిళలు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తే వారికి గత కొన్ని నెలల కింద వాహనాలు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లభించింది. ఇలా అత్యంత కఠినంగా వ్యవహరించే ఈ దేశంలో ఎవ్వరూ చట్టాలను ఉల్లంఘించరు అని భావిస్తాం. ఇక్కడ అవినీతి, అక్రమాలకు ఆస్కారం తక్కువ అని అందరూ అనుకుంటారు. అయితే ఈ దేశంలోనూ అక్కడక్కడా చట్టాల ఉల్లంఘన జరుగుతుంటుంది.
తాజాగా ఈ దేశంలోని ఓ రెస్టారెంటు అక్రమాలకు పాల్పడుతుందని తేలిచింది. అయితే ఒకటి రెండు కాదు ఏకంగా 30 ఏళ్లకు పైగా ఓ రెస్టారెంటులో జరుగుతున్న తంతును చూసి సౌదీ అరేబియా అధికారులను నిర్ఘాంతపోయేలా చేసింది. ఇటీవల జెడ్డా నగరంలోని ఓ రెస్టారెంటుపై అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా, సమోసాలు, ఇతర స్నాక్స్ ను కిచెన్ లో కాకుండా, అక్కడి టాయిలెట్ లోనూ, ఇతర వాష్ రూముల్లోనూ తయారుచేస్తుండడం వారి కంటబడింది. మరింత లోతుగా విచారిస్తే, గత మూడు దశాబ్దాలకు పైగా సమోసాల తయారీకి టాయిలెట్ నే వినియోగిస్తున్న విషయం వెల్లడైంది.
ఈ రెస్టారెంటులో ఆహార పదార్థాల తయారీకి సంబంధించి అధికారులకు కొంత సమాచారం అందింది. దాంతో వారు రెస్టారెంటులో తనిఖీలు చేశారు. ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారుచేస్తుండడమే కాదు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయి రెండేళ్లు గడిచిన చీజ్, ప్యాకేజ్ డ్ మాంసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ రెస్టారెంటుకు అధికారులు తాళం వేశారు. కాగా, యాజమాన్యం ఆ రెస్టారెంటులో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరికీ హెల్త్ కార్డులు ఇవ్వలేదట. గతంలో, జెడ్డాలో షావర్మా అనే ప్రఖ్యాత రెస్టారెంటును కూడా ఇలాంటి పరిస్థితుల్లోనూ అధికారులు మూసివేశారు. అక్కడి ఆహార పదార్థాలపై ఎలుకలు తిరుగుతుండడం వీడియోల ద్వారా వైరల్ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more