కదులుతున్న రైలు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. రైలు నుంచి దిగే క్రమంలో అమె రైలు ద్వారం వద్దనున్న హ్యాండిల్ ను బలంగా పట్టుకోవడంతో ఫ్లాట్ ఫామ్ పై పడింది. అయితే తమ తల్లి పడిపోయిన వెంటనే దానిని గమనించి అమె ఇద్దరు ఆడపిల్లలు తల్లిని కాపాడుకునే క్రమంలో వారు కూడా రైలు నుంచి దూకడం వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అయితే అదే రైలు బోగిలో అప్రమత్తంగా ఉన్న హోంగార్డు.. ఆ మహిళను రక్షించారు.
ముంబైలోని జోగేశ్వర్ రైల్వేస్టేషన్లో జరిగిన ఈ ఘటన వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ప్రయాణికులు ఎవరూ కదులుతున్న రైలు నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేయరాదని మరోమారు విన్నవించారు. ఇక జోగేశ్వర్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ తల్లి తన ఇద్దరుకూతుళ్లతో రైలు ఎక్కింది. అయితే ఆ రైలు తాము అనుకున్న చోటకి వెళ్లడం లేదనో లేక మరే కారణమో తెలియదు కానీ రైలు నుంచి దిగి ప్రయత్నం చేసింది. అప్పటికే కదులుతున్న రైలు నుంచి ప్లాట్ఫామ్ మీదకు దూకేందుకు ఆ మహిళ ప్రయత్నించి.. రైలు వేగం అందుకోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా కిందపడిపోయింది. అలా.. ప్లాట్ఫామ్, రైలు కింద పడిపోబోయింది.
అదే సమయంలో ఆ ఘటనను రైలులో ఉన్న హోంగార్డు అల్తాఫ్ షేక్ చూశారు. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన ఆయన.. ఆమెను వెంటనే పక్కకు లాగేశారు. ఫలితంగా ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అమెకు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనను రైలులో వున్న అమె ఇద్దరు కూతుళ్లు చూశారు. తమ తల్లికి ఏదో జరిగిందని భావించిన వారు.. వెనకాముందు అలోచించకుండా వెంటవెంటనే రైలు నుంచి కిందకు దూకారు. అయితే ఇద్దరు అదుపు తప్పి ఫ్లాట్ ఫామ్పై పడినా.. వారిు ఎలాంటి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లలేదు.
ఈ నెల 16న జనిగిన ఈ ఘటన వీడియోలో తల్లి కోసం పిల్లలు ఎంతగా అలమటించిపోతారు.. వారికి ఏదైనా అపద వస్తే వారు ఎలా రియాక్ట్ అవుతారో ఇట్టే కనబడింది. కానీ కాస్తా చూసుకుని ఉండే బాగుంగేదన్న సూచనలు వినిపిస్తున్నాయి. కాగా.. అప్రమత్తంగా ఉండి ఓ మనిషి ప్రాణాలు కాపాడిన హోంగార్డును స్థానిక యంత్రాంగా అభినందించింది. ఆయనకు రివార్డులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. నెటిజన్లు సైతం.. హోంగార్డుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన అనంతరం.. రైల్వే పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. రైలు ఎక్కేడప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
Home Guard Altaf Shaikh working @grpmumbai saved the life of a lady passenger who fell down during boarding a suburban train at Jogeshwari station on 16/4/22. He is being rewarded for his presence of mind, alertness & dedication to duty @drmbct @DGPMaharashtra @Dwalsepatil pic.twitter.com/1td8B7YLOp
— Quaiser Khalid IPS कैसर खालिद قیصر خالد (@quaiser_khalid) April 25, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more