ఓ మహిళ రెస్టారెంట్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించడం తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. దేశమేన్నది కాదు.. ప్రాంతమేదన్నది సమస్య కాదు.. పురుషాధిక్య సమాజంలో మహిళలకు అణవుణువునా వేధింపులే. చైనాలోనూ అదే జరిగింది. మరీ ముఖ్యంగా చైనాలో యువకులు పెళ్లి చేసుకునేందుకు కూడా అమ్మాయిల కరవు ఏర్పడింది. ఇక అలాంటి చోట తమ కాళ్లపై తాము నిలబడాలని భావించే మహిళలకు ఎదురయ్యే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరితో పాటు మహిళలు తప్పక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
సరిగ్గా వారు చెప్పిందే నిజమైంది. లేకపోతే ఈ మహిళ పరిస్థితి ఎలా మారిఉండేదో.? పెద్దలు చెప్పిన ప్రకారం తన కాళ్లపై తాను నిలబడిన ఈ మహిళ.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. ఓ రెస్టారెంటులో వెయిట్రెస్ గా పనిచేస్తున్న మహిళపై కస్టమర్లు వేధింపులకు పాల్పడగా, ఆమె బెదిరిపోకుండా వారికి తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని రుచి చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఒకరు అమె దెబ్బలకు బెదిరిపోయి వెంటనే పారిపోగా, మరోకరు కాసింత సమయం అమెతో పోరాడి తన్నులు తిన్న తరువాత పారిపోయాడు. ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిన ఈ విడీయోను మీరూ వీక్షించండీ.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న ఈ వీడియోలో రెస్టారెంట్ సిబ్బంది ఒక టేబుల్పై కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు సేవ చేస్తోంది. వారిలో ఒక వ్యక్తి ఆమె వీపుపై చేయి పెట్టి కూర్చోమన్నట్లుగా చెప్పాడు. అంతటితో ఆగకుండా మహిళా వెయిట్రస్ చేయిని కూడా తాకాడు. దీంతో చిర్రెత్తుకోచ్చిన ఆమె వారించింది. అయినా అమెను లాగే ప్రయత్నం చేయడంతో అమె అతని చేయిని వెనక్కు తిప్పింది. ఆ తరువాత ముఖంపై పలుమార్లు పిడిగుద్దులు కురిపించింది. అంతే అతను ఎలాగోలా విడిపించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తమతో కూర్చోని చేతిని లాగాడు, అప్పబహుశా ఆమెను వారితో పాటుగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇలా మొదటి వ్యక్తి నుంచి ఆమె తనను తాను రక్షించుకుంది, అదే సమయంలో తనపైకి దూసుకువచ్చిన రెండవ వ్యక్తిని తన్నడం ద్వారా ఆమె అతని నుంచి ఢిపెన్స్ చేసుకుంది. దీంతో అతను పారిపోతూ మళ్లీ వెనక్కు వచ్చి అమెపై కుర్చి విసిరాడు. దీంతో కుర్చీని పట్టుకున్న అమె.. బలంగా కాలితో తన్నింది. అంతే రెండోవాడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. ఏదిఏమైనా ఆ మగువ ధైర్యానికి నెటిజన్లు నీరాజనాలు అర్పిస్తున్నారు. లేడీ బ్రూస్ లీ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక రెస్టారెంటు యాజమాన్యం సీసీటీవీ ఫూటేజీని తీసి నెట్టింట్లో అప్ లోడ్ చేసింది. అంతే ఈ వీడియో వైరల్ అయ్యింది.
చైనా రెస్టారెంట్ యాజమాన్యం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది తాగుబోతు కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు మహిళా వెయిట్రెస్ లను వేధిస్తుంటారని.. వారిని తాకడానికి ప్రయత్నిస్తుంటారని వివరించారు. అంతటితో ఆగకుండా లైంగిక దాడులకు కూడా తెగబడుతుంటారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మహిళా వెయిట్రెస్లు బాధపడతారు. అందుకు బదులు ఇలా బుద్ది చెప్పడం ద్వారా ఎందుకిలా చేశామా అని తాగుబోతు కస్లమర్లే బాధపడేలా చేసింది. కిందపడి బాధతో విలవిలలాడిన కస్లమర్ చివరకు అమెకు క్షమాపణలు చెప్పాడని యాజమాన్యం చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more