నల్లమల అడవుల్లో అరుదైన అతిధి చేరకుంది. ఎవరా అతిధి అంటే.. ఆగ్నేయ అసియా ఖండంతో ఎక్కువగా దర్శనమిచ్చే అరుదైన పక్షి తెలంగాణలోని అమ్రాబాద్ అడవుల్లో ప్రత్యక్షమైంది. ఆ పక్షి పేరు కూడా విచిత్రంగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని పక్షి తాజాగా కనిపిస్తోంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న “బ్లాక్ బాజా” తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో బ్లాక్ బాజ పక్షి ప్రత్యక్షమైనట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి తెలిపారు. ఏప్రిల్ 9న నల్లమల అడవుల్లో బ్లాక్ బాజ కనిపించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మదన్ రెడ్డి ర్యాపాకు ఈ అందమైన బ్లాక్ బాజ పక్షిని తన కెమెరాలో బంధించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్లాక్ బాజ పక్షి ఆనవాళ్లు లేవని ఆ ఫోటో గ్రాఫర్ చెప్పారు. ఈ పక్షి సాధారణంగా ఈశాన్య భారతదేశం, తూర్పు హిమాలయాలు, చైనా, ఆగ్నేయాసియా అడవుల్లో కనిపిస్తుందని రోహిత్ వెల్లడించారు. ఇవి గద్దలు, రాబందుల జాతికి సంబంధించిన పక్షులు అని పేర్కొన్నారు. బ్లాక్ బాజలు సాధారంగా దట్టమైన అడవుల్లో తరుచుగా కనిపిస్తాయి. వన్యప్రాణుల పెరుగుదలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో విస్తృతమైన చర్యలు చేపడుతున్నామని రోహిత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు... Read more
Aug 10 | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల... Read more
Aug 10 | వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. ఇప్పటివరకు మనకు ఏనుగులు, చిరుతలు, పెద్దపులులు, మొసళ్లు ఇలాంటి వన్యమృగాలు మాత్రమే జనవాసాల్లోకి వచ్చిన విషయం తెలుసు. కానీ దట్టమైన... Read more
Aug 10 | దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల... Read more
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more