గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటికీ సపోర్ట్ నిలిపివేసేందుకు సిద్ధమైంది. దీంతో వాయిస్ కాల్సంభాషణలను రికార్డు చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. అవతలి వ్యక్తి వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం ఇక కుదరదు. ఈ నిబంధనలను వచ్చే నెల అనగా, మే 11 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశముంది. మెజార్టీ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్ను తయారు చేసే గూగుల్ సంస్థ.. కాల్ రికార్డింగ్కు ఎప్పుడూ వ్యతిరేకమే.
అవతలి వ్యక్తికి చెప్పకుండా సంభాషణ రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్నది గూగుల్ వాదన. అందుకే కాల్ రికార్డింగ్ యాప్స్ కట్టడికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ 6 ఓస్ తెచ్చినప్పుడు ఈ యాప్స్పై తొలిసారి వేటు వేసింది గూగుల్. కాల్ రికార్డింగ్కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే.. యాప్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. సరికొత్తగా మళ్లీ కాల్ రికార్డింగ్ యాప్స్ తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 9 ఓఎస్లో వాటికీ కళ్లెం వేసింది గూగుల్. అయితే.. ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఏపీఐని ఉపయోగించి కొందరు యాప్ డెవలపర్స్ మళ్లీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై వేటు వేస్తోంది గూగుల్.
కాల్ రికార్డింగ్ ఇక అసాధ్యమా?: గూగుల్ వర్గాల ప్రకారం.. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కాల్ రికార్డింగ్ కుదరదు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్గా ఇచ్చే డయలర్(ఉదాహరణకు ఎంఐ డయలర్) ద్వారా మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే.. అవతలి వ్యక్తికి కూడా తెలిసేలా 'ఈ కాల్ రికార్డ్ అవుతుంది' అని అలర్ట్ వస్తుంది. దీంతో అవతలి వ్యక్తి కూడా అలర్ట్ కావచ్చు. దీంతో ఎవరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా గూగుల్ చర్యలకు ఉపక్రమించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more