ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు గురువారం వింత అనుభవం ఎదురైంది. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత జిల్లాకు వెళ్లిన రోజాకు స్థానిక నాయకుల నుంచి స్వాగతం లభించింది. ముందుగా తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అమె.. ఇవాళ తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన అమెను అభినందించేందుకు స్థానిక నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పుష్పగుచ్చాలు అందించారు. దీంతో మధ్యాహ్నం సమయంలో పద్మావతి గెస్ట్ హౌస్కు చేరుకున్న అమెను సన్మానించేందుకు అధికారులు, వైసీపీ నేతలు పోటీ పడ్డారు.
అయితే సందెట్లో సడేమియా అన్నట్లు ఎవరి పనిలో వారు నిమగ్నం కాగా, తమ పనిలో తాము నిమగ్నం కావాలని అక్కడికి వచ్చిన ఓ హస్తలాఘవుడు ఏకంగా మంత్రి రోజా మొటైల్ ఫోన్ నే టార్గెట్ చేశాడు. భారీ జన సందోహం నెలకొనడమే అదును భావించిన దొంగ.. అదే అదనుగా భావించి మంత్రి మొబైల్ ఫోన్ను తస్కరించేశాడు. తన సెల్ ఫోన్ కనిపించకపోయే సరికి రోజా కంగారు పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైందన్న ఫిర్యాదుతో పోలీసులు కూడా వెనువెంటనే రంగంలోకి దిగేశారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో రోజా మొబైల్ను చోరీ చేసిన వ్యక్తిని గుర్తించారు.
మంత్రి సెల్ ఫోన్ను తస్కరించేసిన వ్యక్తి,.. ఫోన్తో కారు ఎక్కేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పద్మావతి గెస్ట్ హౌస్లో రోజా సెల్ ఫోన్ను కొట్టేసిన సదరు వ్యక్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లినట్టుగా గుర్తించారు.వెంటనే అక్కడికి పరుగులు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి రోజా సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అతడు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన మంత్రి ఫోన్ దొరకడంతో దానిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి రోజాకు అప్పగించారు. మొబైల్ ఫోన్ చోరీ గురైన సమయం నుంచి తీవ్ర కలవరపాటుకు గురైన రోజా... కాసేపటికే అది తన వద్దకు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more