నక్షత్ర మండలం.. ఎన్నో అద్భుతాలకు, వింతలకు, వీక్షణలకు వేదిక అని తెలిసిందే. ఈ ఖగోళంలో అరుదైన నక్షత్ర కూటములు సంభవిస్తుంటాయి. దానినే ప్లానెట్ ప్యారడైజ్ అని కూడా అంటారు. అయితే ఈ ఏప్రిల్ మాసంలో అరుదైన నక్షత్ర కూటములను వీక్షించే అవకాశం మనకు లభించనుందని ఇప్పటికే పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్యాస్త్ర పండితులు కూడా తెలిపారు. సాధారణ రోజుల్లో తలపైకెత్తి చూస్తే శుక్రుడు (వీనస్), అంగారకుడు (కుజుడు) (మార్స్) కనిపిస్తుంటారు. అయితే ఈ నెలలో మాత్రం ఈ రెండింటి పక్కనే సమాంతర రేఖలో మరో రెండు గ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయని తెలిపారు.
కుజ, శ్రుక్ర గహాలకు సమాంతర రేఖలో గురు (బృహస్పతి / జూపిటర్), శనిగ్రహం (శాటర్న్). దీంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. వీటికి తోడు నిత్యం ఆకాశంలో దర్శనమిచ్చే చంద్రుడు కూడా దర్శనమివ్వనున్నాడు. 2016లో ఒక పర్యాయం ఇలాంటి కూటమి ఏర్పడిన తరువాత రెండేళ్ల క్రితం 2020లోనూ ఇదే తరహాలో నక్షత్రాల కూటములు కనిపించాయి. కాగా 2020 తర్వాత ఇలా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ఇవి మానవ కంటికి నేరుగా కనిపించాయి. అచ్చంగా అలాగే ఇప్పుడు మరో పర్యాయం కూడా మన కంటికి నేరుగా దర్శనం ఇచ్చాయి.
ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more