Family with parents and 5 children charred to death పంజాబ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవ దహనం

7 members from one family charred to death in fire accident in punjab

Family charred to death, parents and 5 children charred to death, Ludhiana East ACP, Surinder singh, Migrant labours, Municipal Garbage dump, Hut, Tibba road, ludhiana, punjab news, Crime

In a tragic fire incident in Punjab's Ludhiana, seven members of one family were charred to death in their hut. According to the police officials, five children along with their parents were charred to death in Ludhiana.

పంజాబ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవ దహనం

Posted: 04/20/2022 01:12 PM IST
7 members from one family charred to death in fire accident in punjab

పంజాబ్‌లో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆదమరచి హాయిగా తమ తల్లిదండ్రుల చెంత నిద్రపోతున్న ఐదుగురు చిన్నారులను అగ్నికిలలు సజీవదహనం చేశాయి. వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా మృత్యువు కబళించి వేసింది. ఈ రోజు తెల్ల‌వారుజామున లుథియానాలోని తాజ్‌పూర్‌ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మృతుల్లో దంప‌తులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నార‌ని చెప్పారు.

వలస వచ్చిన కార్మిక కుటుంబ లుథియానాలోని మున్సిపల్ చెత్త డంప్ వేసే టిబ్బా రోడ్డులోని ప్రాంతంలో రోడ్డుపక్కన గుడిసె ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తోంది. యధావిధంగా నిన్న రాత్రి కూడా అక్కడే నిద్రించిన కుటుంబపై అగ్ని అగ్రహాన్ని చూపి అందరినీ అహుతి చేసింది. అయితే రాత్రి వేరే వేరే ప్రాంతంలో నిద్రించిన వీరి మరో కుమారుడు రాజేశ్‌(17) ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలాడ‌ని వివ‌రించారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్ర‌మాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబస‌భ్యులు మృతిచెందార‌ని అన్నారు. అగ్ని ప్ర‌మాదం ఎలా చోటు చేసుకుంద‌న్న విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles