లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనల్లో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను తన పరిధి మేర ప్రభావితం చేసేందుకు బెయిలు పోందిన అశిష్ మిశ్రాకు తాజాగా అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. రైతులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తూ.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన క్రమంలో.. వారిపై నుంచి వాహనాలను నడుపుకుంటూ.. అడ్డువచ్చిన రైతులను తోక్కించుకుంటూ వెళ్లిన ఘటనలో సర్వోన్నత న్యాయస్థానం అతడ్ని నిందితుడిగా పరిగణించింది.
ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు నిందితుడు అశీస్ మిశ్రాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ బెయిల్ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులతో పాటు ప్రభుత్వానికి నోటీసులు అందించిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ కు అభ్యంతరాలను తెలపడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించిరది., ఇక ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం అశీశ్ మిశ్రాకు బెయిల్ రద్దు చేసింది. అంతేగాక వారంలోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.
కాగా గతేడాది అక్టోబర్లో లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి 10న అలహాదాబ్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరుచేసింది. ఆశిష్కు అలహాబాద్ హైకోర్టు బెయిలివ్వడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ నాలుగో తేదీన విచారణ పూర్తి చేసింది. బెయిల్ రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more