తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన చేరుకునే భక్తుల కోసం కూడా శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఇటీవల శ్రీవారి మెట్టు మార్గం ద్వారా భక్తుల రాకపోకలను టీటీడీ దేవస్థానం బోర్డు నిలిపివేసింది. కాగా ఈ మార్గాన్ని అతిత్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.
గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమయింది. భక్తులు కొండపైకి ఎక్కలేనంతగా దెబ్బతింది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని టీటీడీ మూసివేసింది. ఇక గత ఐదు నెలలుగా ఈ మార్గంలో అనేక మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో ఐదునెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ఈ సందర్భంగా టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో, ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది. శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకోనుండటంపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్ మెంట్లలో భక్తులను ఉంచి, సర్వదర్శనానికి అనుమతిని ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం, వసతి, పాలు, తాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more