భారత దేశంలో తొలిసారిగా త్రిడి ప్రిటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇండియన్ ఆర్మీకి చెందిన అధికారులు ఈ ఘనత సాధించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) గుజరాత్లోని గాంధీనగర్లోని నైరుతి ఎయిర్ కమాండ్లో మొట్టమొదటి 3డి ప్రింటెడ్ ఇళ్లను అధికారులు పూర్తి చేశారు. కేవలం నాలుగు వారాల వ్యవధిలో ఈ రెండు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయడం శుభపరిణామం. ఇక ఈ తరహా త్రిడి ప్రింటింగ్ టెక్నాలజీతో రానున్న రోజుల్లో నిర్మాణ రంగంలో విప్లవాత్మమైన మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇవాళ నైరుతి ఎయిర్ కమాండ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో 3డి ప్రింటెడ్ ఇళ్ల ప్రారంభోత్సవం కూడా జరిగిందని ఇండియన్ఆర్మీ అధికారులు తెలిపారు. కాంక్రీట్ 3D ప్రింటింగ్ అనేది త్రిమితీయ నిజ జీవిత నిర్మాణాలను నిర్మించడానికి ఆటోమేటెడ్ తయారీ పద్ధతి. ఈ సాంకేతికత కాంక్రీట్ 3D ప్రింటర్ను ఉపయోగిస్తుంది, ఇది వినియోగదారు నుండి కంప్యూటరైజ్డ్ త్రీ-డైమెన్షనల్ డిజైన్ ఫైల్ను అంగీకరిస్తుంది. ఇక నిర్మాణంలో వ్యయాలను కూడా సమూలంగా తగ్గించడంతో పాటు నిర్మాణం వ్యర్థాలను కూడా చాలావరకు తగ్గిస్తోందని అన్నారు.
తద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేకమైన కాంక్రీటును వెలికితీసి లేయర్-బై-లేయర్ పద్ధతిలో 3డి నిర్మాణాన్ని రూపొందించింది. కాంక్రీట్ మాడ్యూల్స్ మొదట ఫ్యాక్టరీ లోపల నిర్మించబడ్డాయి, ఎంఈఎస్ నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నాలుగు వారాల్లో రెండు ఇళ్లను నిర్మించింది. పునాది వేయబడింది, తరువాత గోడలు, ఇంటి నిర్మాణ మాడ్యూల్స్ నిర్మించబడతాయి. దాని తర్వాత పూర్తి మెరుగులు టైల్స్ వేయడం, పెయింటింగ్, తలుపులు, కిటికీలతో సహా నూతన ఇళ్లు ప్రారంభోత్సవానికి నెల రోజుల వ్యవధిలో తయారవుతుంది. ప్రస్తుత పద్దతిలో అయితే కనీసం ఆరు నెలల సమయం బదులుగా కేవలం నెల రోజుల వ్యవధిలో నిర్మాణాలు పూర్తయ్యాయి.
#WATCH how the Indian Army’s Military Engineering Services constructed two houses within four weeks using the 3D Printing Technology in construction.
— ANI (@ANI) March 14, 2022
(Source: Indian Army) pic.twitter.com/bMf3G3aO01
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more