లండన్ కు పారిపోయిన భారత ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా ఇప్పుడు నిలువనీడ కరువై నడిరోడ్డున పడ్డాడు. కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చుపెట్టి అత్యంత విలాసవంతమైన వ్యాపారవేత్తగా, లిక్కర్ కింగ్ గా ప్రసిద్దిగాంచిన ఆయన తనకంటూ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇమేజ్ ను సోంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నిజజీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. ప్రజల డబ్బుతో విదేశాలకు ఉడాయిచిన ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో లండన్లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది.
స్విట్జర్లాండ్ కు చెందిన యూబీఎస్కు 20.4 మిలియన్ బ్రిటన్ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదాలు పడుతూవస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్లోని రిజెంట్ పార్క్లో ఉన్న కార్న్వాల్ టెర్రస్ లగ్జరీ అపార్ట్మెంట్ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్ హైకోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్ మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది.
లండన్ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు. వేరే బెంచ్కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు.
లండన్లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్ మెంట్ లో అతని కొడుకు సిద్ధార్థ్ మాల్యా (34)తో పాటు విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు 95 ఏళ్లు. భారత్ బ్యాంకులను కోట్లాది రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్ కు విజయ్మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్హౌస్లు, లగ్జరీ యాచ్లే ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్ మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more