ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో ఓ మొక్క సాయాన్ని తీసుకునేందుకు శాస్త్రవేత్తలు సిద్దమయ్యారు. అదేంటి ఆ మొక్కలో ఉన్న ఆ గోప్పదనం మేంటి.. అది ఎక్కడ ఉంది.? అది కరోనాపై ఎలా పోరాటాన్ని చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? నిజమే.. హిమాలయాల్లో లభించే ఓ మొక్క పుప్పుల రెక్కలతో కరోనాపై యుద్దాన్ని చేసేుందుకు సిద్దమయ్యారు శాస్త్రవేత్తలు. హిమాలయాల్లోని ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అనే మొక్క పువ్వులోని రెక్కలలో వున్న ఔషధ గుణాలు కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారనున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు, ఈ పుష్పాలలోని రెక్కలలో ఫైటోకెమికల్స్ ఉన్నట్టు హిమాచల్ప్రదేశ్లోని మండీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (ఐసీజీఈబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
హిమాలయ ప్రాంతంలో స్థానికంగా "బురాన్ష్" అని పిలువబడే ఈ మొక్కను ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అన్న సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు. ఇందులోని ఫైటోకెమికల్స్ కరోనావైరస్కు వ్యతిరేకంగా పోరాడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వాక్సీన్ యేతర మార్గాలను అన్వేషిస్తున్న తమకు బురాన్ష్ పూలు మార్గాన్ని సులభం చేశాయని తెలిపారు. తాము గుర్తించిన బురాన్ష్ మొక్క పూరేకులను స్థానికులు రకరకాల చికిత్సలో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారని ఐఐటీ మండీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ శరీరంపై వైరల్ దాడిని నిరోధించే నాన్-వ్యాక్సిన్ ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనాను ఔషధాలతో తగ్గించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో బరాన్ష్ మొక్కలోని ఔషధ గుణాలు దోహధం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ పువ్వు రేకులలో ఉన్న రసాయనాలతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చునని చెప్పారు. బరాన్ష్ పుష్పాలలోని రసాయనాలు మన శరీర కణాలలోని గ్రాహకాలను బంధించి, వైరస్లోనికి ప్రవేశించకుండా నిరోధించగలవని,, లేదా మన శరీరంలో దాని ప్రతిరూపణను నిరోధించగలవని ఐఐటీ మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more