శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజమని బెల్జియంలోని ఓ మహిళకు ఎదురైన అనుభవం చెబుతోంది. మరణం అంచుల వరకు వెళ్లినా సురక్షితంగా తిరిగి వెనక్కువచ్చిన అమెపై ఓ అగంతకుడు వెనకునుంచి మృత్యువు ఒడికిలోకి నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సిసిటీవీల్లో రికార్డు కావడంతో అవి కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారాయి. రోమాలు నిక్కపోడిచేలాంటి వీడియో ఇప్పుడు మనవాళ్లూ షేర్ చేసుకోవడంతో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పడు మనదేశంలో వైరల్ గా మారాయి. ఈ ఘటన యూరోప్ దేశాల్లోని బెల్జియంలో చోటుచేసుకుంది. లోని రోగిర్ మెట్రో స్టేషన్.
ఈ వీడియో ఆధారంగా.. బ్రసెల్స్ లోని రోగిర్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు కోసం అందరి ప్రయాణికుల మాదిరిగానే ఓ నడి వయసు మహిళ మెట్రో రైలు కోసం వేచి చూస్తోంది. ఇక ఇంతలో అటు వైపుగా కొన్ని ఓ రైలు సమీపిస్తోంది. మరికోన్ని సెకన్లలో మెట్రో రైలు వచ్చి ప్లాట్ ఫామ్ పై ప్రయాణికుల కోసం అగబోతుంది అనగా, ఆ నడి వయసు మహిళ వెనుకగా వచ్చిన ఓ నల్ల టీషర్టు ధరించిన యువకుడు అడుగులో అడుగు వేసుకుంటూ అమె వెనక్కు చేరాడు. ఇక మరో రెండు మూడు సెకన్లలో రైలు వారి ముందుకు చేరుతుంది అనే క్రమంలో అమె వెనుకగా వెళ్లి ఒక్కసారి అమెను బలంగా పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది.
అంతే ఆకస్మికంగా జరిగిన ఈ చర్యపై అమెకు అసలు అవగాహన లేకపోవడంతో అమెను ఆమె నియంత్రించుకోలేక.. ఒక్కసారిగా వెళ్లి రైలు పట్టాలపైన పడిపోయింది. అంతలో ఏమైందీ అని గమనించేలోగా మహిళ రైలు పట్టాలపై పడింది. అయితే మెట్రో రైలు డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో వెనువెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వినియోగించి రైలుకు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో మహిళను గమనించి తోటి ప్రయాణికులు, మెట్రో రైలు డ్రైవర్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే తోటి ప్రయాణికులు పట్టాలపైకి దూకి మహిళను ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువచ్చారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ పరిణమాలలోనూ మహిళ ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగింది.
ఈ అదృష్టానికి తోడు మహిళా ప్రయాణికురాలికి పెద్దగా గాయాలు కూడా కాలేదు. ఆమె బాగా మందంగల ఉన్నిస్వెటర్ వేసుకోవడం, పడిన తీరు ఆమెను కాపాడాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి కూడా రక్షించింది. కానీ, ఈ ఘటనతో రైలు డ్రైవర్ షాక్ కు గురయ్యాడు. దీంతో స్టేషన్ రక్షణ సిబ్బంది మెట్రో పైలట్ ను, మహిళను హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మహిళను పట్టాలపైకి తోసేసి పరారైన ఆగంతుకుడిని పోలీసులు ఛేదించి మరో మెట్రో స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా చేశాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను నియమించారు.
(Vidéo choc)
— Infos Bruxelles (@Bruxelles_City) January 14, 2022
Tentative de meurtre dans la station de métro Rogier à Bruxelles ce vendredi vers 19h40. pic.twitter.com/dT0ag5qEFu
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more