దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. బూస్టర్ డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి వారి కోసం హర్ గర్ దస్తాక్ అంటూ ఓ కొత్త పథకంతో దేశంలోని ప్రతీ ఇంటికీ వెళ్లీ కరోనా టీకాలు తీసుకున్నవారి ఇళ్ల వద్ద హెల్త్ వాలెంటీర్లు టీకా తీసుకున్నారని సంతకం చేసిన స్టికర్ ను కూడా అతికించే ఏర్పాటు చసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి బలవంతంగా వ్యాక్సిన్ వేయించాలనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే కోవిడ్ టీకాలు తీసుకునేందుకు నిరాకరించిన కొందరు చెట్లు ఎక్కడం, లేదా మరేదో విధంగా టీకాలను తీసుకునేందుకు నిరాకరించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక అనేక మంది భయపడుతూనే.. వీడియోలు తీసుకున్నారు. కొందరు పెద్దవాళ్లూ టీకాలు తీసుకుంటూ ఏడ్చేచారు. ఇంతలా అపనమ్మకంతో టీకాలు తీసుకునేలా చేయడంతో దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేమని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అంగవైకల్యంతో బాధ పడుతున్న వారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని... ఈ నేపథ్యంలో వారికి వారి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్ఛంద సంస్థ పిల్ వేసింది.
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. ఈ పిల్ పై సుప్రీం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. బలవంతగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదని తెలిపింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెపుతుందని... దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా జనాల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more