యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. కొత్త సవత్సరం వేళ ఆయన ఇంట్లోనే కాదు తన కుటుంబం జీవితంలోనూ వెలుగులు నింపేలా.. అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. అయితే డ్రా తీయడానికి కొద్ది గంటలకు ముందు సదానందన్.. తన ఇంట్లోకి మాంసం తీసుకోద్దామని మార్కెట్ కు వెళ్లాడు మార్గమధ్యంలో సెల్వన్ అనే లాటరీ విక్రేత కలవడంతో ఆయన వద్ద లాటరీ కొన్నాడు.. ఇక అటు నుంచి అటే మాంసం దుకానానిక వెళ్లి మాంసం తీసుకుని ఇంటికి వెళ్లాడు.
కొద్ది సేపటికీ లాటరీ టికెట్ ను జేబులోంచి తీసి.. నెంబర్ చెక్ చేసుకన్నాడు. తన లాటరీ టికెట్ నెంబరు ‘ఎక్స్జి 218582’. దీంతో తన లాటరీ టికెట్ డ్రా తీసారిని తెలుసుకున్న సదానందర్ ఫలితాలను చెక్ చేసుకుంటే ఆయన కొన్న టికెట్కు జాక్ పాట్ లభించింది. అంతే ఆయన అనందానికి అవధులు లేవు. ఆయన టికెట్ కు ఏకంగా రూ. 12 కోట్లు తగిలింది. అయితే ఇందులో ఏకంగా 40శాతం మేర పన్నులు పోను ఏకంగా రూ. 7 కోట్ల వరకు సందానందన్ కు లభించనుంది. అయితే తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. తన కుమారులకు మంచి ఇళ్లు, భవిష్యత్తు కల్పించడానికి ఈ లాటరీ ద్వారా లభించిన ధనాన్ని వినియోగిస్తానని చెప్పాడు.
కాగా సదానందన్ కొన్న క్రిస్టమస్ న్యూఇయర్ లాటరీ టికెట్ ధర కేవలం రూ.300. ఇక ఈ లాటరీ రెండవ బహుమతులుగా రూ. 3కోట్ల (ఆరుగురికి) మూడవ బహుమతులు రూ.60 లక్షలు (ఆరుగురికి) అందించినట్లు లాటరీ యాజమాన్యం తెలిపింది. ఇదిలావుండగా ఈ లాటరీ నిర్వహణ కోసం ముందుగా నిర్ణయించినట్లు ఏకంగా 24 లక్షల టికెట్లను ప్రభుత్వం తొలుత ముద్రంచి విక్రయించింది. ఆ తరువాత రెండో పర్యాయం కూడా ఏకంగా 9 లక్షల టికెట్లను ముద్రించి విక్రయించింది. ఇక చివరగా మూడవ పర్యాయం ఏకగా 8.34 లక్షల టికెట్లను విక్రయించగా, అందులోంచి సదానందర్ కొన్న టికెట్ల్ కు మాత్రమే తొలి బహుమతి లభించింది. ఇక గత సెప్టెంబర్ లోనూ ఓ అటో డ్రైవర్ కు ఈ లాటరీ ప్రైజ్ గెలుచుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more