Kerala Painter Wins 1st Prize Worth Rs 12 Crore పెయింటర్ ఇంట రంగులు విరజిమ్మిన కేరళ లాటరీ..

Rs 12 crore lottery brings splash of color in painting worker s life

kerala Christmas New Year Bumper BR-83 lottery result, kerala lottery result, kerala lottery result chart, kerala lottery results list, kerala lottery result chart 2022, kerala lottery result today 2022, kerala lottery result today 2022 today, kerala lottery result Christmas New Year Bumper BR-83, kerala Christmas New Year Bumper BR-83 lottery result, kerala lottery jackpot result, kerala lottery result chart 2022, kerala lottery result 2022, Kerala lottery, Kerala Christmas Bumper Lottery, Kerala lottery results

A painting worker from Kerala's Kottayam recently hit jackpot after winning the state government's Christmas-New Year bumper lottery's first prize carrying ₹12 crore. Sadanandan, a native Kudayampadi near Aymanam, bought the lottery ticket from a vendor on Sunday morning – a few hours before the lucky draw took place in Thiruvananthapuram.

క్రిస్టమస్ జాక్ పాట్: పెయింటర్ ఇంట రంగులు విరజిమ్మిన కేరళ లాటరీ..

Posted: 01/17/2022 12:24 PM IST
Rs 12 crore lottery brings splash of color in painting worker s life

యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్‌... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. కొత్త సవత్సరం వేళ ఆయన ఇంట్లోనే కాదు తన కుటుంబం జీవితంలోనూ వెలుగులు నింపేలా.. అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్‌– నూతన సంవత్సరపు బంపర్‌ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. అయితే డ్రా తీయడానికి కొద్ది గంటలకు ముందు సదానందన్‌.. తన ఇంట్లోకి మాంసం తీసుకోద్దామని మార్కెట్ కు వెళ్లాడు మార్గమధ్యంలో సెల్వన్ అనే లాటరీ విక్రేత కలవడంతో ఆయన వద్ద లాటరీ కొన్నాడు.. ఇక అటు నుంచి అటే మాంసం దుకానానిక వెళ్లి మాంసం తీసుకుని ఇంటికి వెళ్లాడు.

కొద్ది సేపటికీ లాటరీ టికెట్ ను జేబులోంచి తీసి.. నెంబర్ చెక్ చేసుకన్నాడు. తన లాటరీ టికెట్ నెంబరు ‘ఎక్స్‌జి 218582’. దీంతో తన లాటరీ టికెట్ డ్రా తీసారిని తెలుసుకున్న సదానందర్ ఫలితాలను చెక్‌ చేసుకుంటే ఆయన కొన్న టికెట్‌కు జాక్ పాట్ లభించింది. అంతే ఆయన అనందానికి అవధులు లేవు. ఆయన టికెట్ కు ఏకంగా రూ. 12 కోట్లు తగిలింది. అయితే ఇందులో ఏకంగా 40శాతం మేర పన్నులు పోను ఏకంగా రూ. 7 కోట్ల వరకు సందానందన్ కు లభించనుంది. అయితే తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్‌ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్‌ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. తన కుమారులకు మంచి ఇళ్లు, భవిష్యత్తు కల్పించడానికి ఈ లాటరీ ద్వారా లభించిన ధనాన్ని వినియోగిస్తానని చెప్పాడు.

కాగా సదానందన్ కొన్న క్రిస్టమస్ న్యూఇయర్ లాటరీ టికెట్ ధర కేవలం రూ.300. ఇక ఈ లాటరీ రెండవ బహుమతులుగా రూ. 3కోట్ల (ఆరుగురికి) మూడవ బహుమతులు రూ.60 లక్షలు (ఆరుగురికి) అందించినట్లు లాటరీ యాజమాన్యం తెలిపింది. ఇదిలావుండగా ఈ లాటరీ నిర్వహణ కోసం ముందుగా నిర్ణయించినట్లు ఏకంగా 24 లక్షల టికెట్లను ప్రభుత్వం తొలుత ముద్రంచి విక్రయించింది. ఆ తరువాత రెండో పర్యాయం కూడా ఏకంగా 9 లక్షల టికెట్లను ముద్రించి విక్రయించింది. ఇక చివరగా మూడవ పర్యాయం ఏకగా 8.34 లక్షల టికెట్లను విక్రయించగా, అందులోంచి సదానందర్ కొన్న టికెట్ల్ కు మాత్రమే తొలి బహుమతి లభించింది. ఇక గత సెప్టెంబర్ లోనూ ఓ అటో డ్రైవర్ కు ఈ లాటరీ ప్రైజ్ గెలుచుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles