దేవుడి సోంత రాష్ట్రంలో కేరళలలో ఓ భార్య తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదుతో అత్యంత దారుణమైన పోకడలు బయట పడుతున్నాయి. తమ ఇంటి ఇల్లాలి వైపు కన్నెత్తి చూస్తేనే సహించని భర్తలు పుట్టిన పురటిగడ్డలో.. వేదమంత్రోచ్చరణల మధ్య పంచభూతాల సాక్షిగా ఒక్కటైన తమ జీవిత భాగస్వాములను వేరేవారికి అప్పగించి.. ఇతరుల సతీమణులతో లైంగిక సుఖాన్ని పొందాలనుకునే భావజాలం క్రమంగా విస్తరిస్తోంది. బలవంత పెట్టి మరీ భార్యలను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది నచ్చని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు.
తన భర్త.. మరో పురుషుడితో లైంగిక సంబంధానికి బలవంతం చేస్తున్నాడంటూ.. ఇది తనకు ఇష్టంలేదని చెప్పినా.. ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు దిగుతున్నాడని ఓ బాధితురాలు కేరళలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఇప్పటికే తనను తొమ్మిది మందితో లైంగిక సంబంధం పెట్టుకునేలా చేశాడని అమె అరోపించింది. దీంతో తనకు ఇష్టం లేకున్నా తనపై అత్యాచారం చేసిన వారిలో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా అమెతో లైంగిక సంబంధం పెట్టుకున్న మిగిలిన వ్యక్తలు పరారీలో వున్నారని, వారిలో ఒకరు విదేశాలకు కూడా వెళ్లిపోయాడని తెలిపింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో కీలకమైన ఏడుగురిని అరెస్టుచేశారు. అయితే తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోందని. ఈ కేసులో ఏకంగా వెయ్యికిపైగా జంటలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తెలింది. దీంతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఈ కేసులు పలువురు బడాబాబుల ప్రమేయం కూడా ఉన్నారని సమాచారం. గతంలో కయంకులమ్ లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సాయంతో ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ లలో గ్రూపులు ఏర్పాటు చేసి, వీటి ద్వారా సభ్యుల మధ్య అనుసంధానత కల్పిస్తున్నారు.
తమకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్తను అరెస్ట్ చేశామని, దీని వెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా నడుస్తున్న భాగస్వాముల మార్పిడి ముఠాలో సుమారు 1,000 మంది వరకు ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఉన్నత కుటుంబాల వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 25 మందిపై నిఘా ఉంచారు. మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more