కరోనా వైరస్ మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఎఫ్ ఢిఏ ఆ దేశంలోని కోవిడ్ రోగులకు అనుమతించిన ఓరల్ డ్రగ్ మోల్నుపిరవీర్ ను గతవారం రోజుల క్రితం భారత ఔషధ నియంత్రణ డీసీజీఐ అధికారులు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓరల్ డ్రగ్ వైరస్ ఆర్ఎన్ఐలోకి దూసుకెళ్లి.. అవి వృద్ది చెందకుండా అడ్డుకోవడంలో దోహదపడతాయని పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మందును ఎవరు తీసుకోవాలి.. అన్న విషయాన్ని ఇదివరకే డీసీజిఐ సహా ఔషధ సంస్థలు కూడా తెలిపాయి.
అయితే ఇప్పటికే ఈ మందును తయారు చేసేందుకు దేశంలోని 18 సంస్థలు అనుమతిని పోందాయి. ఈ క్రమంలో మ్యాన్ కైండ్ ఫార్మా కీలక అడుగు ముందుకేసి.. తమ కంపెనీ నుంచి ఒక్క వ్యక్తికి కావాల్సిన కోర్సు మాత్రలను విడుదల చేసింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ ‘మోలులైఫ్’ మాత్రల ధరను కేవలం 1399కే అందించనుంది. ఇక ఈ మాత్రలను మ్యాన్ కైండ్ కంపెనీతోపాటు డాక్టర్ రెడ్డీస్, బయలాజికల్ ఇ, హెటిరో, సహా పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. అయితే తాజాగా ఐసీఎంఆర్ ఈ మందు వినియోగంలో హెచ్చరికలు జారీ చేసింది. మెల్నుఫిరవిర్ డ్రగ్ తో ముప్పు పోంచి వుందని భారత వైద్య పరిశోధన మండలి చీఫ్ బలరాం భార్గవ ప్రజలను అప్రమత్తం చేశారు.
మెల్నుఫిరవిర్ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్లే ఈ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదన్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు. లేదంటే పుట్టే పిల్లలు పలు సమస్యల బారినపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా, కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more