తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఇది రాష్ట్రాలతో పాటు దేశంలోనూ ధర్డ్ వేవ్ రాబోతుందన్న సంకేతాలను ఇస్తుందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి కరోనాకేసుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని డెల్టా వేరియంట్ తో పోల్చితే ఇది ముఫైరెట్టు అధికంగా విస్తరిస్తుందని అన్నారు. ఈ సూచనలుకరోనా థర్డ్ వేవ్కు సంకేతమని చెప్పారు. దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజారోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని అన్నారు.
అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించానని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలలో పాల్గోనేవారు తప్పనిసరిగా సాధ్యమైనంత బౌతికదూరాన్ని పాటించాలని సూచించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ను పెట్టుకోవాలని తెలిపారు. ఈ వేడుక నిర్వాహకులు తప్పనిసరిగా ఫూర్తి వాక్సీనేషన్ డోసు తీసుకున్నవారినే అనుమతించాలని కోరారు. సంక్రాంతి తర్వాత థర్డ్వేవ్ వచ్చే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆ కేసులు పెరిగాయని తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని, అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కానీ, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాధి కన్నా అది సోకిందన్న భయమే మనిషిని విషమ పరిస్థితుల్లోకి నెడుతుందని అన్నారు. దేశంలో తొలి దశ, రెండో దశలో కరోనా విజృంభణ సమయంలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజలు మాస్క్ ధరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. వాటి ద్వారానే ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. వాక్సీన్ తీసుకోనివారు ఇప్పటికైనా టీకాను తీసుకుని ఒమిక్రాన్ తో కూడిన ధర్డ్ వేవ్ నుంచి రక్షణ పోందాలని ఆయన కోరారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపారు. గతంలో కరోనా రెండు దశల్లో వ్యాప్తి జరిగినప్పుడు కరోనాపై విజయం సాధించామని చెప్పుకొచ్చారు. మూడో దశ వ్యాప్తి సూచనల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే, భయపడకూడదని, వైరస్ కన్నా భయమే ప్రమాదకరమని ఆయన చెప్పారు. అయితే, ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపులాంటిదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more