కాన్పూర్ కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారవేత్త, ‘నల్లధన కుబేరుడు’ పీయూష్ జైన్ పన్ను ఎగవేతతో ఇంట్లో దాచిన కోట్ల రూపాయల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ఇంట్లో నోట్ల గుట్టలను చూసి అధికారులే నోరెళ్లబెట్టి.. ఏకంగా 120 గంటల పాటు నోట్లను లెక్కించిన విధానంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ అక్రమార్జన సోమ్మును ఒకటి, రెండేళ్లుగా ఆయన ఆర్జించింది మాత్రం కాదు. దాదాపుగా 300 కోట్ల రూపాయలలో ఏకంగా 177 కోట్ల మాత్రం పన్ను ఎగవేత వేసిందేనని స్వతహాగా ఆయన కూడా చివరకు అంగీకరించాడు. అంతకుముందు మాత్రం తమ పూర్వికులకు చెందిన 400 కిలోల బంగారాన్ని అమ్మి ఆర్జించానని చెప్పాడు.
కాగా ఇన్నేళ్లుగా ఆయన అక్రమంగా సంపాదిస్తున్నా.. అధికారులకు ఎందుకు అనుమానం రాలేదు. అసలు ఆయనను తమ నజర్ లో ఎందుకు పెట్టలేదు. అంటే ఆయన ఏ రోజు కూడా హంగులు.. ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులను కూడా వాటికి దూరంగా ఉంచారు. జైన్ ఇంటి ముందు రెండు పాతకార్లు మాత్రమే ఉంటాయి. వాటిల్లో ఒకటి టోయోటా క్వాలిస్ కాగా మరోకటి మారుతి కారు. ఇక ఆయన తన సోంతూరు కననౌజ్ కు వెళ్లినప్పుడు అక్కడ తన పాత బజాజ్ ప్రియా స్కూటర్ పైనే తిరిగేవారని స్థానిక గ్రామస్థులు తెలిపారు. ఇలాంటి ఆయన అక్రమార్జన ఒక్కసారిగా ఎలా బయటపడింది..? ఆయన ఎలా చిక్కారు అన్న వివరాల్లోకి వెళ్తే..
దొంగ ఎంత తెలివిని ప్రదర్శించినా.. ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడన్నది తెలిసిన విషయమే. అలానే అవసరాన్ని మించిన నకిలీ ఇన్వాయిస్, వే బిల్లులతోనే అడ్డంగా బుక్కయ్యాడు. కొద్దిరోజుల క్రితం జీఎస్టీ చెల్లించకుండా సరఫరా చేస్తోన్న, నాలుగు పొగాకు, పాన్ మసాలా ట్రక్కులను అధికారులు పట్టుకున్నారు. దర్యప్తులో భాగంగా అధికారులు శిఖర్ పాన్ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్ క్యారియర్ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్ వాయిస్ లను అధికారులు గుర్తించారు. దీనిపై శిఖర్ పాన్ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించాగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు.
అయితే శిఖర్ పాన్ మసాలాలో ఒడోకామ్ ఇండస్ట్రీస్ వాటాలు ఉన్నట్లుగా కూడా గుర్తించిన అధికారులు.. నకలీ ఇన్వాయిస్ లు, ఈ-వే బిల్లుల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రెండు కంపెనీలపై దాడులు నిర్వహించారు. ఓడోకామ్ రిజిస్ట్రర్డ్ అడ్రస్ ఉన్న కంపెనీ యజమాని అయిన పీయూష్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఒడోకామ్ కంపెనీకి యజమాని అయిన పియూష్ జైన్ ఇంటిపై దాడుల్లో ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బు లభించింది. రూ.280 కోట్ల నోట్ల కట్టు రెండు బీరువాల్లో లభ్యంకాగా, వాటిలో ఏకంగా రూ.177 కోట్లు పన్నుఎగవేసి కూడబెట్టినవే. నలుగురు బ్యాంకు అధికారులు ఏకంగా 120 గంటల పాటు వీటిని లెక్కించడానికి శ్రమించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more