ఎన్నికల వేళ.. రాజకీయనాయకులకు అత్యంత సన్నిహితులైన వారిళ్లపై దాడులు జరగడం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పరిపాటిగా మారింది. అక్రమ డబ్బును స్వాథీనం చేసుకోవడం.. అక్రమ మార్గాల ద్వారా డబ్బును కూడబెట్టిన వారిని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం.. వారి నుంచి అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడం షరామామూలుగా మారింది. ఓ విధంగా ఇలా నల్లడబ్బు పట్టబడటం ఉత్తమమైనదే అయినా.. కేవలం ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లలో మాత్రమే డబ్బులు, ఆస్తుల పత్రాలు పట్టుబటం.. బీజేపి దాని మిత్రపక్షాల నేతలకు మాత్రం మినహాయింపు లభించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ పర్ వ్యూమ్ ట్రేడర్ అయిన పియూష్ జైన్ అనే వ్యాపారవేత్త ఇంటిపై దాడి చేసిన అధికారులు ఏకంగా 120 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి నుంచి ఏకంగా 257 కోట్ల రూపాయల నగదుతో పాటు దుబాయ్ లోని ఖరీదైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. దీంతో పాటు బంగారు, వెండి ఆబరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పియూష్ జైన్ భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత, అఖిలేష్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై గత గురువారం రోజుల ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇంట్లోని రెండు అల్మారాలో నీట్ గా టేప్ చుట్టి నోట్ల గుట్టలు కనిపించడంతో.. ఐటీ అధికారులు జీఎస్టీ అధికారులను అలర్ట్ చేశారు. ధీంతో ఇరు విభాగాలకు చెందిన అధికారులు ఈ దాడులను నిర్వరామంగా 120 గంటల పాటు నిర్వహించారు. అక్రమ డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు ఖరీదైన పత్రాలను సీజ్ చేశారు. కాన్పూర్ లోని 4, కన్నౌజ్లో 7, ముంబైలో 2, ఢిల్లీలో ఒక్క ఆస్తికి సంబంధించిన పత్రాలతో పాటు దుబాయ్ లోని రెండు ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లుల ద్వారా పీయూష్ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడి.. ఈ మొత్తాన్ని కూడబెట్టినట్లు గుర్తించారు. సుమారుగా రూ. 1000కోట్ల వరకు ఈ సుగంధ ద్రవ్య వ్యాపారి పన్ను ఎగవేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పీయూష్ జైన్ సమాజ్వాదీ పార్టీ నేతగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన సమాజ్ వాదీ పార్టీ పేరుతో ఓ సమాజ్ వాది సెంటును కూడా విడుదల చేశారు. ఈ సెంటును తన కంపెనీలోనే తయరూ చేయించిన ఆయన దానిని అఖిలేష్ సమక్షంలోనే మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయనను టార్గెట్ చేశారన్న విమర్శలు కూడా వున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీపై అధికార బీజేపి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more