ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై పలువురు అధికార పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి ప్రతిగా కొందరు టీడీపీ మహిళా నేతలు అనంతపురంలో పత్రికా సమావేశంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మహిళా నేతలపై ఏయే సెక్షన్ల కింద కేసును నమోదు చేశారో.. మరి అలాంటప్పుడు వారి ఇల్లు వంటగదులతో పాటుగా ఎందుకని పోలీసులు సోదాలు నిర్వహించారని ఈ నెల 10న న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ కేసులో జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఈ మేరకు తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. ఇక హాజరుకాబోయేందుకు ముందు తమ ఎదుట ఈ కేసుకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. అనంతపురంలో కొందరు టీడీపీ మహిళా నేతలపై నమోదైన కేసు, ఆ తర్వాతి పరిణామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎస్పీ ఫకీరప్పపై ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలపై నమోదైన కేసుకు, వారి ఇళ్లలో సోదాలు చేయడానికి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందో చెప్పాలని నిలదీసింది. ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సోదాలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీని ప్రశ్నించగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ మహిళా నేతలకు ఇది వరకే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more