ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. డెల్టా వేరియంట్ తో పోల్చితే దీని ప్రభావంత తక్కువని ఇప్పటికే వైద్య నిఫుణులు చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది కూడా ప్రమాదకారి అన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ లో ఏకంగా 15 మందిని పోట్టన పెట్టుకున్న ఒమిక్రాన్ అటు, అమెరికాలో మరణాన్ని నమోదు చేసుకుంది. ఇక తాజాగా ఇజ్రాయెల్లో ఒమిక్రాన్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని దేశవైద్యవిభాగం అధికారులు ధ్రువీకరించారు.
దక్షిణ నగరమైన బీర్షెబాలోని సోరోకా ఆసుపత్రిలో ఒమిక్రాన్ సోకిన 60 సంవత్సరాల వ్యక్తి రెండు వారాల క్రితం చికిత్స నిమిత్తం చేరారని అసుపత్రి వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తి సోమవారం మరణించాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఇంతకు ముందు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడ్డాడని తెలిపారు. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదివరకే రెండు డోసుల కరోనా వాక్సీన్ తో పాటు మహమ్మారి దరిచేరకుండా బూస్టర్ డోస్ కూడా అందించిన ఇజ్రాయిల్.. ఇక 60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో ఏదో ఒక అరోగ్య సమస్య తలెత్తిన నేపథ్యంలో వారికి మరో బూస్టర్ డోస్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
ఈ మేరకు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నట్ అరోగ్యశాఖ అధికారులకు అదేశాలను అందించారు. ఆవరమై ఏళ్లకు పైబడిన వారితో పాటు అరోగ్యపరంగా తీవ్ర సమస్యలను ఎదుర్కోంటున్నవారితో పాటు ఇమ్యూనిటీ తక్కువగా వున్నవారికి నాల్గవ డోస్ కరోనా వాక్సీన్ ను అందించాలని అదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసింది. ఆ తర్వాత బూస్టర్ డోస్ సైతం అందించిన దేశంగా నిలిచింది. 9.3 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో కొవిడ్ కారణంగా 8,200 మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more