రోజురోజుకూ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో నమోదువుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ మధ్యనెల నుంచి ఆకస్మికంగా పెరిగిన చలితీవ్రంగా రాత్రివేళ్లలో మాత్రం పంజా విసురుతోంది. గత పది రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోగా.. గత మూడురోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లగాలుల ప్రభావంతో మరో మూడు నుంచి నాలుగు రోజుల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సోసైటీ సహా పలు ప్రవైటు వాతావరణ సంస్థలు, బ్లాగులు మాత్రం ఈ వారాంతం వరకు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మాత్రం మరింత కనిష్టంగా నమోదైయ్యే అవకాశాలు వున్నాయని తెలుపారు. ఇప్పటికే తెలంగాణలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలో సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపాయి. ఇక సోమవారం ఉదయం ఎనమిదిన్నర నుంచి పది గంటల వరకు రాష్ట్రంలో కనిష్టంగా 13.9 డిగ్రీల సెల్సీయన్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగురోజుల పాటు రాత్రవేళ ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు పడిపోయే అవకాశం వుందని తెలిపింది. సాయంత్రం ఆరుగంటలకే రాష్ట్రంలో చలి అలుముకుంటోంది.
మంగళవారం వేకువజాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్హత్నూర్లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ పేర్కొంది. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more