భారతదేశంలో సాధారణంగా అమ్మాయిల పెళ్లి వయస్సు పద్దెనిమిదేళ్లు. కానీ ఇకపై 21 ఏళ్లు. ఔనండీ ఇది ముమ్మాటికీ నిజం. దీంతో 2020లో పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఒక ఏడాది సమయం తరువాత వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూడా ఈ కీలక నిర్ణయం పట్ల అమోదం తెలిపింది. అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అబ్బాయిల వివాహ వయస్సు మాదిరిగానే ఇకపై అమ్మాయిలకు కూడా 21 ఏళ్లు దాటిన తరువాతే వివాహాలు జరపాలని నిర్ణయం తీసుకుంది.
అబ్బాయిలు ఇన్నాళ్లు అమ్మాయిల కన్నా కనీస వివాహ వయస్సులో కొంచెం ఎక్కువగా ఉన్నారు. కాగా తాజాగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సరిసమానమే. కొంచెం ఎక్కువ కాదు.. కొంచెం తక్కువ కాదు. ఈ మేరకు అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచాలని తమ ప్రణాళిక సమీక్షలో వుందని ప్రధాని గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కారించుకుని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా చెప్పిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ప్యానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని కేంద్ర క్యాబినెట్ తీసుకుంది.
గతేడాది జూన్ లో జయ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ ఉన్నత నిపుణుడు వీకే పాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మొదటి గర్భధారణ సమయంలో స్త్రీకి కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్ఫోర్స్ నొక్కిచెప్పింది. కేంద్ర క్యాబినెట్ ఈ సవరణకు అమోదం కూడా తెలిపిన నేపథ్యంలో ఇక పార్లమెంటులోని ఉభయ సభల్లో దీనికి అమోదం ప్రకటించుకోనుంది. దీంతో ఈ నూతన సవరణను బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకురానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more