పురుషాధిక్య సమాజంలో ఈ మహిళకు ఎదురైన ఘటనలు జీవితంపైనే విరక్తి కల్పించాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి.. సకాలంలో అమె స్నేహితురాళ్లు, మహిళా సంఘాలు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో అమె అన్యాయం న్యాయస్థానం దృష్టికి చేరింది. అయితే అమె చేసిన పిర్యాదులపై తక్షణం కేసు నమోదు చేయాలని న్యాయస్థాని అదేశాలు జారీ చేసింది. అమె పిర్యాదును తీసుకోని పోలీసులు, అమెకు అబార్షన్ చేసిన వైద్యులు, క్లినిక్ నిర్వాహకులు, సిబ్బంది సహా ఎనమిది మందిపై కేసులను నమోదు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ పోలీసులు.. అమె ఇన్ని కష్టాలపాలైయ్యేందుకు కారణమైన అప్పటి ఎస్ఐ.. సుందరలింగం మాత్రం ఇప్పుడు ఇన్స్ పెక్టర్ హోదాలో బదిలీ కావడం విశేషం.
తమిళనాడులోని కన్యాకుమారీ జిల్లాలోని కలియక్కవిలై ప్రాంతానికి సమీపంలోని మోకుడు ప్రాంతంలో నివాసముండు జాస్పిన్ అనే మహిళా నర్సు నివాసముంటుంది. అమెకు వివాహమై.. తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే కూతురిని చదువు నిమిత్తం హాస్టల్ లో ఉంచిన జాస్పిన్ అమె ఒంటిరిగా నివాసముంటోంది. అయితే అమె భర్తతో విడిపోయింది. ఒంటిరిగా వుంటున్న అమెపై ఓ స్థానికుడు కన్నువేశాడు. అమెను అన్నివిధాలుగా వాడుకుని ఆ తరువాత మోసం చేశాడు. దీంతో అతడి నయవంచనను భరించ లేకపోయిన జాస్పిన్ అతడిపై పిర్యాదు చేయడానికి పోలిస్ స్టేషన్ కు వెళ్లింది.
ప్రేయుడి చేతిలో మోసపోయిన అమె ఫిర్యాదు తీసుకున్న కలియక్కవిలై పోలిస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే తన అచూకీని పిర్యాదులో పేర్కోన్నడంతో అమె ఇంటికి విచారణ పేరుతో వెళ్లిన ఎస్ఐ అమె ఇంట్లోనే గంటల కొద్దీ సమయం గడిపాడు. అమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న అతను అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ తరువాత కూడా అమె ఇంటికి తరచూ వస్తూ.. అమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. దీంతో నర్సు గర్భం దాల్చిందని తేలియడంతో ఆమెను పరీక్షల పేరుతో అసుపత్రికి తీసుకెళ్లి..అబార్షన్ చేయించాడు.
అయితే అతనిపై పిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. అమె మహిళా సంఘాలతో కలసి అందోళనకు సిద్దమై విసిగి, వేసారి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో విషయం న్యాయస్థానం దృష్టికి చేరడంతో.. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ మహిళ (32)కు వివాహమైంది. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడు మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
అక్కడామెకు సాయం చేసే నెపంతో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ సుందరలింగం (40) బాధితురాలిని పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినట్టు తెలిసి ఓ క్లినిక్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు నమ్మించి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై ఆమె పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరింది. అయినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కోర్టును ఆశ్రయించగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సుందరలింగం, అబార్షన్ చేసిన డాక్టర్ కార్మల్ రాణి (38) సహా 8 మందిపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more