దేశంలో పరువు హత్యలకు అడ్డుకట్ట పడడంలేదు. కులం కూడు పెట్టదు.. మతం మర్యాద నిలపదు.. గుణమేరా మిన్న.. అంటూ అనేక మంది సంఘ సంస్కకర్తలు.. సమాజాంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా.. ఇప్పటికీ కులం, గోత్రం, మతం, వర్ణం అంటూ మనిపిని మనిషిగా ప్రేమించే తత్వాన్ని మర్చిపోతున్నారు. తమ బిడ్డలను తమకు తామే కడతేర్చుకుంటున్నారు. ప్రేమ పరిణయాలు అధికమవుతున్న ఈ రోజుల్లో అగ్రవర్ణాల్లోని కొందరు మాత్రం ఇంకా బేషజాలకు పోతూ క్రూరులుగా మారుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన రీతిలో ఓ పరువు హత్య జరిగింది.
తమ కులానికి చెందని వ్యక్తిని తన సోదరిని పెళ్లాడందని మైనర్ బాలుడు తన సోదరిని అత్యంత కిరాతకంగా అంతమొందించి, అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేయడం గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘాతుకం జరిగింది. 19 ఏళ్ల అమ్మాయి ఓ యువకుడ్ని ప్రేమించింది. అయితే అమ్మాయి తరఫు వారు ఒప్పుకోలేదు. దాంతో ఆ అమ్మాయి, యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వైజాపూర్ లోని అత్తింట్లో ఉంటోంది. కొన్నాళ్ల కిందట గర్భం దాల్చింది.
అయితే, ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర అవమానానికి గురిచేసింది. ఇటీవల ఆమె తల్లి వైజాపూర్ వెళ్లి కుమార్తెను ఇంటికి రావాలంటూ పిలిచింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. దాంతో తల్లి మరోసారి వైజాపూర్ వచ్చింది. ఈసారి కుమారుడ్ని కూడా తీసుకుచ్చింది. అయితే, ఆ యువతి కిచెన్ లో ఉండగా... తల్లీకొడుకు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తల్లి కాళ్లు గట్టిగా పట్టుకోగా, కుమారుడు ఆ యువతిని కొడవలితో నరికాడు.
కిచెన్ లో శబ్దాలు రావడంతో మరో గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె భర్త వచ్చాడు. దాంతో అతడిని కూడా చంపేందుకు ఆ తల్లీకొడుకు ప్రయత్నించారు. కానీ ఆ యువకుడి వారి నుంచి తప్పించుకున్నాడు. ఆపై ఆ మైనర్ బాలుడు తన సోదరి తలను మొండెం నుంచి వేరు చేసి బయటికి తీసుకువచ్చి చుట్టుపక్కల వారికి చూపించాడు. అంతేగాదు, రక్తపుమడుగులో ఉన్న ఆమె మృతదేహం వద్ద ఆ తల్లీకొడుకు సెల్ఫీలు కూడా దిగారు. అనంతరం ఆ బాలుడు సమీప పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more