క్షణకాలంలో జీవితం ముగిసిపోయిందే అని భావన కలిగే ఘటనలు కొందరికి ఎదురవుతుంటాయి. ఇక జీవితం ముగిసిపోయిందే అని పెద్ద అపద నుంచి తప్పించుకున్నప్పుడు.. లేదా ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయట పడినప్పుడు అనుకుంటాం. మరణపు అంచుల వరకు వెళ్లివచ్చామన్న ఫీలింగే.. ఆ క్షణంలో ఎధురయ్యే గుండెదడ వివరించలేదే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పూరిలియా రైల్వేస్టేషన్ లోనూ ఓ మహిళకు కూడా అదే అనుభవం ఎదురైంది. కదులుతున్న రైలు.. వేగాన్ని అందుకుంటున్న సమయంలో దానిని దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. అనుకోకుండా మరణపు అంచుల వరకు వెళ్లింది. అయితే సకాలంలో స్పందించిన ఆర్సీఎఫ్ ఎస్ఐ అమెను కాపాడారు.
ఓ మహిళ రైలు దిగడాన్ని గమనించిన ఆయన.. అమె పక్కకు పడిందని ఊపిరి పీల్చుకునే లోపు మరో మహిళ కూడా అదే పని చేసి ఫ్లాట్ ఫాంపై పడి.. కిందపడిన అమెను క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగుపరుగున వచ్చిన రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారి అమెను చటక్కున పక్కకులాగి రైలు కింద పడనీయకుండా చేశాడు. మరో విధంగా చెప్పాలంటే అమె ప్రాణలతో సురక్షితంగా ఉందంటే.. ఆ అధికారి కాపాడటం వల్లే. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 29న మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటలకు పూరుల్యా రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫామ్ నెంబరు 4లో సంట్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్దంగా వుంది. అదే సమయంలో పురిలియాకు చెందిన ఇద్దరు మహిళలు రైలు ఎక్కారు.
అయితే వారితో పాటు రైలు ఎక్కాల్సిన మరో వ్యక్తి రైలును అందుకునే లోపే అది కాస్తా ముందుకు కదిలింది. దీంతో ఆయన వారిని రైలు దిగాలని సైగా చేశాడు. అంతే వారు వెనకాముందు ఆలోచించకుండా రైల్లోంచి కిందకు దిగారు. ముందుగా దిగిన ఓ మహిళ దిగడంతోనే కిందపడింది. అయితే అమె కాసింత దూరం వెళ్లడంలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకుంది. కాగా అమె వెంటనే దిగిన మరో మహిళ రైలు అప్పటికే వేగాన్ని అందుకోవడంతో.. ఏమాత్రం దిగే అవకాశం లేకపోయినా దిగేసింది. దీంతో అమె వెంటనే కిందపడింది. ఇక రైలు కింద పడే ప్రమాదం కూడా ఉంది. ఇది గమనించిన రైల్వే అధికారి బబ్లూ కుమార్ వెంటనే పరుగుపరుగున వెళ్లి.. అమెను రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్యనున్న గ్యాప్ లో పడకుండా కాపాడాడు. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం రెండూ ప్రమాదకరమేనని ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు మరోమారు సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవి దృశ్యాలను రైల్వేశాఖ తమ సామాజిక మాద్యమాల్లో పెట్టింది. దీంతో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన రైల్వే పోట్రోక్షన్ ఫోర్స్ అధికారి బబ్లూ కుమార్ పై నెటిజనులు ప్రశంసలు కురుస్తున్నాయి. రద్దీగా వుంటే పురుల్యా రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా సిబ్బంది బృందాలు ఎంతో అప్రమత్తంగా వుంటాయని బబ్లూ కుమార్ మరోమారు నిరూపించాడు. ఆర్పీఎఫ్ ఎస్ఐ బబ్లూ కుమార్ పై రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడీయోను నెట్టింట్లో అప్ లోడ్ చేసిన పోలీసులు.. క్షణకాలం తొందరతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా సూచిస్తున్నారు.
#Lifesavingact
— RPF Adra Division (@rpfserada) November 30, 2021
On 29.11.21 SI/Bablu Kumar of RPF Post Purulia saved the life of a lady passenger while she was trying to de-board & almost come in the gap between train & platform in running train no 22857 at Purulia station.@RPF_INDIA @sanjay_chander @zscrrpfser@ADRARAIL pic.twitter.com/qC5eHeDu45
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more