దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళ, క్యాబ్ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. ఒక్కసారి కాదు ఏకంగా ఐదు సార్లు అలాగే కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటి కొన్ని నెలల క్రితం రోడ్డు దాటుతున్న యువతి తనను క్యాబ్ డ్రైవర్ ఢీకొంటాడేమోనన్న అందోళనలో కోట్టిన ఘటన గురించి ఇప్పుడు చెబుతున్నారేంటీ అంటారా.? ఈ ఘటనకు ఆ ఘటనకు ఏ మాత్రం సంబంధమే లేదు. అయితే ఈ రెండు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలోనే చోటుచేసుకున్నాయి.
ఆ ఘటన గురించి పక్కనబెడితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలల్లోకి వెళ్తే.. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి వాహనానికి ఒక క్యాబ్ డ్రైవర్ దారి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన నీలం కలర్ టీ షర్టు ధరించిన మహిళ క్యాబ్ డ్రైవర్ను కారు నుంచి బయటకు లాగింది. అందరూ చూస్తుండగా చొక్కా పట్టుకుని దూషిస్తూ అతడి చెంపపై కొట్టింది. ఇలా ఒక్కసారి కాదు ఐదు స్లారు కోట్టింది. అక్కడున్న కొందరు సర్ది చెప్పేందుకు యత్నించగా వారిపై కూడా ఆ మహిళ విరుచుకుపడింది.
కాగా, కొందరు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆదిత్య సింగ్ అనే ట్విట్టర్ యూజర్ దీనిని పోస్ట్ చేశారు. ఆయన మాత్రమే మహిళ దాడిని అడ్డుకుని.. ప్రశ్నిస్తూ ఏంటీ ఎందుకని కొడుతున్నావ్ అని ప్రశ్నించారు. క్యాబ్ డ్రైవర్ ఎలాంటి తప్పు చేయకున్నా ఆయన చెంపను ఐదుసార్లు కోట్టారు. ఇదే మీకు జరిగితే ఊరుకుంటారా.? అని నిలదీశాడు. ఈ ఘటన చూసి తాను చాలా బాధపడినట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. అయితే ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్పై దాడి చేసిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Sad I had to see this! pic.twitter.com/HVGHvEMkPB
— Aditya Singh (@Aditya22rajpoot) November 17, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more