అభిమానం హద్దుల్లో ఉంటేనే ముద్దు. అది ఎవరిపైనైనా సరే. హద్దు మీరిన ప్రేమ అధోగతి పాలవుతుందని ఇప్పటికే ఎంతో మంది నటినటులు.. సెలబ్రిటీలు తమ అభిమానులకు చెప్పారు. ప్రతీ ఒక్కరి జీవితానికి ఓ పరమార్థం ఉంటుందని, దానిని పూర్తి చేయడానికి పాటుపడాలే తప్ప.. హద్దులు మీరిన అభిమానంతో అఘాయిత్యాలకు పాల్పడకూడదని కూడా కోరారు. అయినా ఓ అభిమాని మాత్రం తన అభిమాన నటుడి చిత్రం నుంచి సకాలంలో అప్ డేట్ రావడం లేదంటూ.. ఎదురుచూసి.. లాభం లేదని.. సైసైడ్ నోట్ రాశడు.
అంతేకాదు ఆ లెటర్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ లెటర్ రాసింది ఒక రెబల్ స్టార్ ఫ్యాన్ అయినప్పటికీ ప్రతి రెబల్ స్టార్ ఆవేదన ఇది అంటూ చెప్పుకొచ్చాడు ఆ అభిమాని. ఇదిలావుంచితే రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14 వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే చిత్రం నుంచి తాజాగా ఎలాంటి అప్ డేట్ రాకపోవడం.. ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదలైన టీజర్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం కూడా అభిమాని ఆత్మహత్యకు కారణం కావచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు మీరు అప్డేట్ ఇవ్వకపోటం వల్ల రాయక తప్పడం లేదు. నా చావు చూసైనా రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ అంటూ చెప్పుకొచ్చాడు. తన ఆందోళన, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆ సూసైడ్ లెటర్ రాశాడు. తన మరణానికి యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణలే కారణమని లెటర్ లో పే్కోన్నారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు ఇట్లు రెబల్ స్టార్ ఫ్యాన్ అంటూ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more