దీపావళి పండగ అంటేనే సంతోషం, ఆనందం. బడా వ్యాపారవేత్తల నుంచి తమ స్థాయి కోద్ది చిన్న, గృహ పరిశ్రమల వరకు అందరూ తమ కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లేదా.. కానుకలు అందిస్తుంటారు. ఇక కొన్ని కంపెనీలు స్వీట్లు, టపాసులు కానుకగా అందిస్తాయి. అయితే దేశంలో ఇప్పటికే మనం అనేక కంపెనీలు దీపావళి రోజులన తమ కార్మికులకు కార్లు, ఇత్యాధి కానుకలు కూడా అందించిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ చిన్న కంపెనీ మాత్రం వినేత్న అలోచనతో అందని దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశవ్యాప్తంగా టాక్ అప్ ది టౌన్ గా మారింది.
సూరత్కి చెందిన ఈ కంపెనీ యజమాని ఔరా అనిపించేలా తమ కార్మికుల జేబులను ఎప్పుడు ఖాళీ కాకుండదని అలోచించింది. అంతేకాదు అదే సమయంలో పర్యావరణహితం కోసం కూడా అలోచించింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన అలియన్స్ సంస్థ తమ కార్మికుల హితం కోసం అలోచించింది. ఎంబ్రాయిడరీ వర్క్ చేసే ఈ కంపెనీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. కంపెనీ ఎదుగుదలతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని తలిచాడు. దీపావళి పండుగని అందుకు తగిన సందర్భంగా ఎంచుకున్నాడు.
తమ ఆఫీసుకు వచ్చి పోయే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఒక్కో ఉద్యోగికి ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ని పండగ గిఫ్ట్గా అందించాడు. ఒక్క స్కూటర్ ఎక్స్షోరూం ధర రూ.76,848లుగా ఉంది. మొత్తం సంస్థలో ఉన్న ముప్రై ఐదు మందికి ఈ స్కూటర్లను అందించాడు. 2 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓకినావా స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 58 కి.మీలు. ఒకసారి ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఈవీల ఉపయోగించం వల్ల కొంతైనా కాలుష్యం కూడా తగ్గుతుంది. అందుకే ఈవీ స్కూటర్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాని అలయన్స్ డైరెక్టర్ సౌరభ్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more