ప్రకృతి ప్రకోపానికి దేవభూమి ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికిపోతోంది. మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఏకంగా 47 మంది అసువులు బాసారు. పదకోండు మంది గల్లంతుకాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాల ధాటికి వరదలు కూడా ముంచెత్తడం.. మరోవైపు కొండ చరియలు విరిగిపటడం కూడా సంభవిస్తుండటంతో ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకోస్తుందో తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటివరకు ఏకంగా 1300 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.
పాశ్చాత్య అవాంతరాలు, ఆగ్నేయ గాలుల కారణంగా కురిసిన అత్యంత భారీ వర్షాలతో పర్వతాల నుంచి మైదానాల వరకు పెను విధ్వంసం కలిగింది. ఈ క్రమంలో 100 సంవత్సరాల క్రితం నమోదైన రికార్డులూ బద్దలయ్యాయి. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. కుమావన్ ప్రాంతంలోని ముక్తేశ్వర్లో 107 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 18, 1914 న 254.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపావత్లో 580 మి.మీ, నైనిటాల్లో 530 మి.మీ, జియోలికోట్ 490 మి.మీ, భీమ్టాల్ 400 మి.మీ, హల్ద్వానీలో 300 మి.మీ వర్షాపాతం రికార్డయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
వాతావరణ మార్పుల కారణంగా రికార్డు స్థాయిలో వర్షాన్ని చవిచూసిన తీవ్రంగా నష్టపోయిన కుమావన్ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమయం పడుతుందని అన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్ల చోప్పున అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నివారణ చర్యలు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇక వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చోప్పును పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more