ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది మోడళ్లు.. ఫోటో షూట్ లో పాల్గోన్నారు. ఇదేంటి రెండు వందలు కాదు మా దేశంలో ఏకంగా వందలాది మంది మోడళ్లు కలసి ఫోటో షూట్ లో పాల్గోంటారు అంటారా. అయితే వారంతా బట్టలు వేసుకుని ఫోటో షూట్ లో పాల్గోంటే ఇక్కడ ఈ రెండు వందల మంది మోడళ్లు మాత్రం నగ్నంగా ఫోటో షూట్ లో పాల్గోన్నారు. అదేంటీ వీరంతా నగ్నంగా ఎందుకు ఫోటో షూట్ దిగారూ అంటారా.? కారణమేంటీ ఏంటని తెలుసుకోవాలని వుందా... ఓ మంచి కాజ్ కోసం వీరు ఈ మేరకు ఫోటో షూట్ చేశారు.
ఇంతకీ వీరంతా కలసి ఎక్కడ ఈ న్యూడ్ ఫోటోషూట్ కు సన్నధమయ్యారంటే.. డెడ్ సీ వద్దనున్న ఎడారిలో వాళ్లంతా ఒకే సారి ఫోటోషూట్ లో పాల్గోన్నారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టునిక్ ఈ ఫోటోలను తీశారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్ల రంగు వేసుకుని ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అదేంటి ఈ తెల్లరందు దేనికి సంకేతం అంటారా.? అసలు ఈ ఫోటో షూట్ కు కారణం ఏంటంటే.. ఇజ్రాయిల్ లో నీటి సమస్య తీవ్రంగా వుంది. డెడ్ సీ వద్దనున్న జలసంపత కూడా రాను రాను తరగిపోతోంది. ఈ సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో న్యూడ్ ఫోటో షూట్ ను ఏర్పాటు చేశారు.,
54 ఏళ్ల ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ఆదేశాలకు తగినట్లు మోడళ్లు ముందుకు కదిలారు. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ గతంలో ఓ సారి వెయ్యి మంది మోడళ్లతో ఉప్పునీటి సముద్రమైన డెడ్ సీ వద్ద న్యూడ్ ఫోటోలు తీశారు. ప్రతి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీటరు మేర ఎండిపోతున్నది. ఇజ్రాయిల్, జోర్డాన్లు ఎగువ ప్రాంతంలో నీటి మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు మైనింగ్ కూడా సమస్యగా మారింది. మోడళ్లకు వైట్ పేయింట్ వేయడానికి ట్యునిక్ ఓ కారణం చెప్పాడు. బైబిల్లోని కథ ప్రకారం.. లాట్ అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మోడళ్లకు తెలుపు రంగు వేసినట్లు టునిక్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more