లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ ఘటనకు కారకుడైయ్యాడని అరోపణలు ఎదుర్కోంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రెండో పర్యాయం నిన్న పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సిట్ పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి అశీష్ శక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించగా మాట్లాడకుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, లఖీంపూర్ ఖేరీలో రైతుల మీదకు కారు దూసుకెళ్లినప్పుడు తాను ఆ కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేనని క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆశీష్ మిశ్రా స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను దంగల్ లో ఉన్నానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. దాంతో పాటు పది మంది సాక్షుల వాంగ్మూలాలనూ దానికి జత చేశారు. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆశిష్ ను విచారించింది.
శుక్రవారం ఉదయం విచారణకు గైహాజరు కావడంపై ఆయన వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే తాను శుక్రవారం ఉదయం పోలీసు విచారణకు హాజరు కాలేకపోయానని అజయ్ మిశ్రా పేర్కోన్నారు. దీంతో అధికారులు తాజా సమన్లు ఇవ్వడంతో ఆయన విచారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఎవరినీ అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more