ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్ లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ అగ్రనటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ ఖైదీల మదారిగానే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో జుడీషియల్ రిమాండ్ లో వున్నాడు. అయితే ఆయనకు ఇంటి బోజనం ఇచ్చేందుకు ఇప్పటికీ న్యాయస్థానం నుంచి ఎలాంటి అదేశాలు అందకపోవడంతో ఆయన జైలు బోజనాన్నే తీసుకుంటున్నాడు. ఆర్యన్ ఖాన్ తో పాటు ఆయన ఐదుగురు మిత్రులు ఆర్థర్ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా వున్నారు.
జైలులోని మొదటి అంతస్తులో ఉన్న బ్యారక్ నంబర్ వన్ను వీరికోసం కేటాయించారు. దీనిని క్వారంటైన్ సెల్గా ఉపయోగిస్తున్నారు. ఆర్యన్ ఇందులో ఐదు రోజులపాటు క్వారంటైన్లో ఉంటాడు. ప్రస్తుతానికి ఆర్యన్ అతని మిత్రులకు కరోనా నెగిటివ్ రిపోర్టు లభించింది. అయినా వీరు ఇక్కడ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని జైలు అధికారులు తెలిపారు. ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఆర్ఎం నెర్లికర్.. డ్రగ్స్ కేసులో అర్యన్ సహా అతని మిత్రులకు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపించిన విషయం తెలిసిందే.
ఆర్యన్ ను కూడా ఇతర ఖైదీల్లానే పరిగణిస్తామని జైలు అధికారులు ఇది వరకే తెలిపారు. కాగా ఇంటి జీవితానికి జైలు జీవితానికి వున్న వత్యాసం ఏంటో ఆర్యన్ కు ఇప్పుడు బోధపడనుంది. జైలులో సాధారణ ఖైదీల మాదిరిగానే ఆయనతో పాటు ఆయన మిత్రులు కూడా తెల్లవారుజామున 6 గంటలకే అధికారులు గంట మ్రోగించి మరీ నిద్ర లేపుతారు. ఏడు గంటలకల్లా అల్పాహారం చేయాల్సి వుంటుంది. కాగా అల్పాహారం తరువాత జైలు అవరణలో ఖైదీలు తిరిగే అవకాశం వున్నా.. ఆర్యన్ ఖాన్ అతని మిత్రులు క్వారంటైన్ లో ఉండటంతో వారికి మాత్రం తిరిగే అవకాశం లేదు. ఇక ఉదయం 11 గంటలకు మధ్యాహ్న బోజనం, సాయంత్రం ఆరు గంటలకు డిన్నర్ ఉంటుంది.
అల్పాహారంలో లో సాధారణంగా షీరా పోహా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చపాతి, కూర, పప్పు, అన్నం వడ్డిస్తారు. అయితే ఆర్యన్ కు కానీ అతని మిత్రులకు కానీ ఇంటి బోజనం పెట్టేందుకు న్యాయస్థానం అదేశాలు జారీ చేయలేదు. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప.. జైలు అధికారులు అందుకు అనుమతించరు. జైలు అధికారులు పెట్టే బోజనం రుచించకపోయినా.. లేక సరిపోక పోయినా జైలులోని క్యాంటిన్ లో అందుబాటులో వుండే ఇతర ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కాగా వాటికి డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. ఈ డబ్బు కూడా మనీ అర్డర్ ద్వారానే ఖైదీలకు అందాల్సివుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more