SC directs CBI to file FIR against Audimulapu Suresh couple ఏపీ మంత్రి అక్రమాస్థుల కేసు: సీబిఐ విచారణకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్

Supreme court gives green signal for cbi to probe on adimulapu suresh s assets case

Adimulapu Suresh, Supreme Court, CBI Probe, green signal, disproportionate assets, VijayaLakshmi, IRS officer, assets exceeding income, Andhra Pradesh, Crime

Andhra Pradesh Education Minister Adimulapu Suresh and his wife had received a backlash in the Supreme Court as it has given the green signal to the CBI to investigate the disproportionate assets. The Supreme Court has ruled out the judgment of the Telangana High Court and allowed the CBI to register an FIR and conduct an inquiry.

ఏపీ మంత్రి అక్రమాస్థుల కేసు: సీబిఐ విచారణకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్

Posted: 10/08/2021 03:49 PM IST
Supreme court gives green signal for cbi to probe on adimulapu suresh s assets case

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ సహా ఆయన సతీమణికి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని ఐఆర్ఎస్ అధికారులు అనేకమంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న అరోపణలు వినిపించాయి. దీనిపై స్పందించిన కేంద్రం 2016లో దేశవ్యాప్తంగా ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లలో సోదాలను నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఆదిమూలపు సురేశ్ సతీమణి విజయలక్ష్మి కూడా ఐఆర్ఎస్ అధికారి కావడం చేత.. అప్పట్లో వారి ఇంట్లోనూ సీబిఐ తనిఖీలు చేపట్టింది. 2017లో అదిమూలపు సురేష్, అతని భార్య విజయలక్ష్మిలపై కేసును కూడా నమోదు చేసింది. దీంతె తన ఇంట్లో జరిగిన సీబిఐ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఆదిమూలపు సురేష్ తెలంగాణ హైకోర్టును అశ్రయించారు. అయితే విచారణ జరిపిన తరువాత న్యాయస్థానం.. అదిమూలపు సురేష్ దంపతులు మోపిన అభియోగాలను తోసిపుచ్చింది.

కాగా 2010–2016 మధ్య వారి ఆస్తులు ఆదాయానికి మించి 22 శాతం ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వారిద్దరి ఆదాయం రూ.4.84 కోట్లే కాగా.. అంతకుమించి రూ.5.95 కోట్ల ఆస్తులున్నాయని తేల్చారు. దీంతో వారిద్దరిపై సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు.. మరోమారు కేసును రిజిస్టర్ చేసి.. ప్రాథమిక విచారణ జరపాలని సిబిఐని అదేశించింది. దీంతో న్యాయస్థానంలో తాము ఆశించిన మేర తీర్పు రాకపోవడంతో అదిమూలపు సురేష్ దంపతులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ కేసును విచారించిన తరువాత ఇవాళ సిబిఐకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. గతనెల 22న సుప్రీంకోర్టులో వాదనలు ముగియగా, ఇవాళ తీర్పును వెలువరిస్తూ న్యాయస్థానం సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles