హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కలకలం రేపిన లెడీస్ బాత్రూమ్లో సీసీ కెమెరా వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ లోని వన్ డ్రైవ్ రెస్టారెంట్ లెడీస్ బాత్రూమ్లో సీసీ కెమెరాను ఓ యువతి గుర్తించింది. వెంటనే యువతి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే వన్ డ్రైవ్ రెస్టారెంట్ యజమాని చైతన్య, ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు బాత్ రూమ్లో సీసీ కెమెరా ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల నుంచి కెమెరా అక్కడ ఉంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్లో హౌస్కీపర్గా పనిచేస్తున్నాడు. హౌస్కీపర్ బెనర్జీ మైనర్ కావడం గమనార్హం. అతనే స్పై క్యామ్ పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్పై క్యామ్ లో ఐదు గంటల డేటా ఉంది. స్పై క్యామ్ విషయంలో హౌస్కీపర్ని అరెస్ట్ చేసినా.. రెస్టారెంట్లో అసలు సీసీ కెమెరా బ్యాకప్ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపైన కూడా అనుమానాలకు తావిస్తోంది. అందుకే హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. హౌస్ కీపర్ బెనర్జీ సీక్రెట్ కెమెరా అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది యువతుల నగ్నదృశ్యాలు సీక్రెట్ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం బెనర్జీ, చైతన్యను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more