దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాహనదారులు ఎంతో ఆశగా శుభవార్త కోసం ఎదురుచూసినా.. వివరాఖరుకు కేంద్రం వారి ఆశలను అడియాశలుగా మార్చింది. దాదాపుగా 20 నెలల తరువాత ఇవాళ భేటీ అయిన జీఎస్టీ మండలి వాహనదారులకు చేధువార్తనే చెప్పింది. ఇంధనాన్ని జీఎస్టీ పరిథిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మిలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చబోవడం లేదని ప్రకటించారు.
2019లో భేటీ అయిన తరువాత దాదాపు 20 నెలల అనంతరం శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశాని అమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను రాష్ట్రాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయని చెప్పారు. వాటిని జీఎస్టీలో చేర్చేందుకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. కాగా గత జూన్ మాసంలో ఇంధనంతో పాటు పెట్రో ఉత్సత్తులను జీఎస్సీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ సమీక్షించాలని సూచించింది. ఈ మేరకు తమకు అనేక వినతులు వెల్లువెత్తడంతో పాటు రిట్ పిటీషన్లను కూడా దాఖలైన నేపథ్యంలో దీనిని సమీక్షించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని, జీఎస్టీ కౌన్సిల్ ను కోరింది.
కాగా కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించామన్న నిర్మలా సీతారమన్.. రాష్ట్రాలు ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకించాయిని.. దీంతో ఇప్పుటికీ అనువైన సమయం కాదని కౌన్సిల్ అభిప్రాయపడిందని అమె అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ అంశంపై మరోమారు చర్చిస్తామని అమె అన్నారు. కేరళా హైకోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తామని ఆమె చెప్పారు. కాగా అత్యంత ఖరీదైన కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కూడా జీఎస్టీ మండలి నిర్ణయించిందని నిర్మల వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more