Saidabad rape-murder accused found dead on railway track రైల్వే ట్రాకుపై శవంగా.. సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు

Hyderabad child rape and murder accused raju found dead on railway tracks

Saidabad rape case, Accused dead, Pallakonda raju, Saidabad, Saidabad rape, Pallakonda raju, Pallakonda raju dead, Pallakonda raju dies, Railway tracks, station Gahanpur, Pallakonda raju encounter, Hyderabad rape, Telangana, Crime

The accused in the Saidabad rape case, where a six-year-old child was raped and murdered on September 9, was found dead at Station Ghanapur in Telangana. Hyderabad East Zone DCP Ramesh said, “It is true that the accused has died. I will have to ascertain more details with the concerned police personnel. I am told that the police were chasing him and not heeding to the warning, he jumped in front of a train.

రైలు కింద పడి సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు మృతి

Posted: 09/16/2021 11:31 AM IST
Hyderabad child rape and murder accused raju found dead on railway tracks

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసు నిందితుడు రాజు రైల్వే ట్రాకుపై శవంగా మారాడు. తన గురించి తెలంగాణ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారని, తనను వారు చేధించి పట్టుకుంటారన్న విషయం అవగతం కావడంతో ఇక తాను చేసిన తప్పుకు మరణమే శరణమని ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్ పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు లోకో పైల‌ట్ పోలీసుల‌కు తెలిపాడు.

మృతుడి చేతిపై ఉన్న మౌనిక అనే ప‌చ్చ‌బొట్టు ద్వారా అతడ్ని సైదాబాద్ సింగరేణి కాలనీలోని ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచార నింతుడు పాలకొండ రాజుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గ‌త ఏడు రోజుల నుంచి రాజు క‌నిపించ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే. రాజును ప‌ట్టుకునేందుకు 70 బృందాల‌ను పోలీసులు రంగంలోకి దించారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జ‌ల్లెడ ప‌ట్టారు. ఈ నేపథ్యంలో తాను పోలీసులకు దొరికిపోతానని, వారు తనను తప్పక పట్టుకుంటారన్న భయంతో రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన సైదాబాద్‌లో చిన్నారిపై రాజు హ‌త్యాచారం చేశాడు. అప్పటి నుంచి నుంచి రాజు క‌నిపించ‌కుండా పోయాడు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా చేప‌ట్టారు. ఇక అన్ని వైన్ షాపుల వ‌ద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. బ‌స్సులు, ఆటోల‌పై రాజు ఫోటోలు ప్ర‌ద‌ర్శించి.. అత‌ని ఆచూకీ కోసం విస్తృతంగా త‌నిఖీలు చేశారు. రాజు నిన్న ఉప్ప‌ల్ ప్రాంతంలో సంచ‌రించిన‌ట్లు తెలుస్తోంది. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 ల‌క్ష‌లు రివార్డు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles