శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం ప్రపంచంలోనే మూడోస్థానానికి చేరినా.. ఇంకా దేశంలో మూడాచారాలు, మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఇటీవల ఉత్తరభారతంలోని ఓ రాష్ట్రంలో వర్షాల కోసం అక్కడి మైనర్ బాలికలను నగ్న ప్రదర్శన చేసి వరుణదేవుడికి భజనలు చేసిన ఘటన మర్చిపోకముందే తెలంగాణలోని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే నమ్ముతున్నారు. కడుపులో నొప్పి వస్తే ఆస్పత్రికి పోవాల్సింది పోయి పసరు మందు కోసం పరిగెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్న దారుణ పరిస్థితులు ఇంకా దేశంలో ఉన్నాయి. బంగారు తెలంగాణ దిశగా ఏడేళ్లుగా పయనిస్తున్నా.. మూడనమ్మకాలను బాపడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి.
వైద్యం పేరుతో వింత చేష్టలకు పాల్పడడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మూఢ నమ్మకం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది. జిల్లాలోని కరకగూడెం మండలం అశ్వాపురం పాడువలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం ఓబాబు పుట్టాడు. సోమవారం రాత్రి ఆ చిన్నారి కడుపునొప్పి వచ్చి బాధతో ఏడవ సాగాడు. కడుపు నొప్పి తగ్గేందుకు వారు మూఢ నమ్మకాల వైపు మొగ్గు చూపారు. బాబును తీసుకుని గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని సంప్రదించారు.
అతడు బాబు బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. నొప్పితో చిన్నారి మరింత ఏడ్వసాగాడు. ఆవ్యక్తి చిన్నారికి పసరు మందు పోశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త చిన్నారిని వెంటనే గుర్తించి కరకగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. పరిస్ధితి విషమించటంతో వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా భద్రాచలం ఆస్పత్రికి పంపించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా శిశువు కడుపులో చిన్న పేగు తెగినట్లు గుర్తించారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చిన్నారి కన్ను మూశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more