బ్యాంకులోని తన ఖాతాలో ఉన్న డబ్బులను ఖర్చుపెట్టుకున్న వ్యక్తిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక ఆ వ్యక్తిపై ఏలాంటి కేసులు నమోదు చేయాలా.? అన్న విషయంలో మాత్రం వారు తర్జనభర్జన పడుతున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులకు సకాలంలో సముచితంగా స్పందించలేదని అతినిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు న్యాయస్థానంలో నిలుస్తుందా అన్న అనుమానాలు కూడా పోలీసులలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సదరు వ్యక్తి తన ఖాతాలోకి వచ్చినపడిన డబ్బులు మాత్రమే ఖర్చు చేశాడు, కానీ ఎవరి నుండి డబ్బులు రుణంగా తీసుకోలేదు. అలా అని అక్రమంగా సంపాదించి డబ్బును బ్యాంకులో జమ చేయలేదు.
అయితే పోలీసులు అతడిపై కేసు ఎందుకు నమోదు చేశారు. ఇక తన ఖాతాలోని డబ్బులు తానే ఖర్చు పెట్టే అధికారం ఖాతాదారులకు ఉందికదా.? మరి పోలీసులు ఎందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మ్యాటర్ లోకి ఎంటర్ కావాల్సిందే.. బ్యాంకు అధికారుల పొరపాటుతో ఒక వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. దీన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఆ డబ్బును తిరిగిచ్చేయాలని అడిగారు. అయితే ఆ సొమ్మును ప్రధాని మోదీ నుంచి వచ్చిందనుకొని ఖర్చు పెట్టేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్లోని ఖగారియా ప్రాంతంలో జరిగింది.
స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో జరిగిన చిన్న పొరపాటుతో.. ఈ ఏడాది మార్చి నెలలో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. తర్వాత తీరిగ్గా తమ పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ సొమ్మును తిరిగిచ్చేయాలని రంజిత్ను అడిగారు. ‘‘ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తారని వార్తలొచ్చాయి. నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి విడత ఇన్స్టాల్మెంట్ అనుకున్నా. ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడునా దగ్గర డబ్బు లేదు’’ అని రంజిత్ చెప్పాడు. బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్ను అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more