ఉత్తరప్రదేశ్ ఓ జాతీయ ఖోఖో క్రీడాకారిణిని దారుణ రీతిలో హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దళితవర్గాలకు చెందిన యువతులపై జరగుతున్న అత్యాచారాలు చివరకు జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న దళిత క్రీడాకారిణి వరకు చేరాయి. 24 ఏళ్ల ఆ క్రీడాకారిణి బిజ్నోర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర గాయాలతో, విరిగిన పన్ను, గోంతు, శరీరం పై రక్తపు గాయాలతో శవమై కనిపించింది. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరో తేల్చే విషయంలోనూ పోలీసులు మీనమేషాలు లెక్కబెడుతూ.. అది తమ పరిధి కాదని, రైల్వే పోలీసులు పరిధి కాబట్టి వారే కేసు నమోదు చేయాలని చెప్పడం బాధితురాలి కుటుంబసభ్యులను తీవ్ర కలతకు గురిచేసింది.
పోలీసుల కథనం ప్రకారం... సెప్టెంబరు 10న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ యువతి ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగివెళ్లే క్రమంలో బిజ్నోర్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అక్కడ షాజాద్ అలియాస్ హమీద్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఆ ఖోఖో క్రీడాకారిణి ఒంటరిగా ఉండడంతో ఆమెపై కన్నేసిన హమీద్... ఆమెను సిమెంటు స్లీపర్ల చాటుకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఓ ఫ్రెండ్ తో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా, ఆమె కేకలు అవతలి వ్యక్తికి కూడా వినిపించాయి.
కొంచెం సేపటి తర్వాత ఆమె అరుపులు ఆగిపోయాయి. ఆమె ప్రతిఘటించడంతో హమీద్ ఆమె మెడకు దుపట్టా బిగించి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపై, నిందితుడు ఆమె మొబైల్ ఫోన్ తో పరారయ్యాడని తెలిపారు. సిమెంటు స్లీపర్ల చాటున రక్తపుమడుగులో పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన హమీద్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ చేశాడు.
టెక్నాలజీ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చొక్కాపై రక్తపు మరకలు పడగా, వాటిని అతడి భార్య ఉతికి శుభ్రం చేసినట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఓ చెప్పు, రెండు చొక్కా గుండీలు లభ్యమయ్యాయి. కాగా, ఆమె ఫ్రెండ్ ఫోన్ కాల్ ఆడియో క్లిప్పింగ్ ను పోలీసులకు అందజేయడం కేసు విచారణలో ఎంతో ఉపకరించింది. నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని, అతడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more