దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంపై భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అందోళన వ్యక్తం చేసింది. రెండో దశలో పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని అయితే పెరుదుతున్న కేసులు కరోనా మహమ్మారి మూడో దశ (థర్డ్ వేవ్)కు సంకేతాలేనని ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్ సామిరన్ పాండా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. పండుగల సీజన్ లో సామూహిక వేడుకల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోతే అవి సూపర్ స్పెడింగ్ వేడుకలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ కంటే ముందుగా థర్డ్ వేవ్ దూసుకొస్తుందని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా చవి చూడని రాష్ట్రాల్లో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు ముందస్తుగా ఉపసంహరించొద్దని సూచించారు. మిజోరం, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో దేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచే ఉందని, అది అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చనని తేలింది. అయితే, ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా ఏదైనా కొత్త రకం బయటపడితేనే దీని ఉద్ధృతి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో ఇటీవల సంభవించిన రెండో దశ ఉద్ధృతితో పోలిస్తే మూడో దశ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కూడా స్పష్టం చేశారు.
ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ఉన్న మ్యూటెంట్లే మున్ముందూ కొనసాగితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా, ఏదైనా ప్రమాదకర వేరియంట్ పుట్టుకొస్తే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని, అప్పుడు రోజుకు గరిష్ఠంగా లక్ష వరకు కేసులు నమోదవుతాయని మనీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే డెల్టా వేరియంట్కు మించిన వేరియంట్లు లేవని, ఒకవేళ సెప్టెంబరులో అలాంటి వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే అక్టోబరు-నవంబరు మధ్య మూడో దశ తీవ్రంగా ఉంటుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more