భావితరాల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు.. చిన్నారులపై కామవాంఛతో అఘాయిత్యాలకు పాల్పడితే.. అభం శుభం తెలియని చిన్నారి మనస్సులో ఎంతగా గాయపడతాయో.. ఊహించ తరం కాదు. ఇక వారికి విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నం చేసే ఇతర ఉపాధ్యాయులపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఇలాంటి గురువు లకు న్యాయస్థానాలు తగు శిక్షను విధించి.. శిక్షకాలంలోనూనా గుణపాఠం నేర్చుకునేలా చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో న్యాయస్థానం అతడికి కఠిన శిక్ష విధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు సునీల్కుమార్ (40)కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు దొడ్డా సునీల్కుమార్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. గతేడాది కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో చదువు పేరిట కొందరు బాలికలను తరచూ పాఠశాలకు రప్పించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.
తమపై లైంగికదాడి జరిగినట్టు ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో కీచక గురువు వ్యవహారం బయటపడింది. దీంతో గతేడాది డిసెంబరు 15న తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడిపై పోక్సో చట్టంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడికి సహకరించారన్న ఆరోపణలపై మరో తొమ్మిది మందిపై లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో 24 మంది సాక్షులను జడ్జి విచారించగా, నిందితుడు దొడ్డా సునీల్కుమార్పై నేరం రుజువయ్యింది. మిగతా తొమ్మిది మందిపై అభియోగాలు రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టేశారు. నిందితుడు సునీల్కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.11 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more