దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది కొత్త జడ్జీల నియామకాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమోదం తెలిపారు. దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతత్వంలో.. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖన్ విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్; జస్టిస్ ఎల్ నాగేశ్వర రావులతో కూడిన సుప్రీంకోర్టు కోలిజియం వీరిని సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కొలిజీయం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాజాగా ఈ 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా అమెదం తెలిపారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులలో మొత్తం 9 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు కూడా స్థానం దక్కింది. ఈ మేరకు ఈ సిఫారసులను కేంద్రం అనుమతించగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి నియమాకం ఫైలుపై సంతకం చేశారు. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులవుతున్న న్యాయమూర్తుల్లో .. సీనియర్ న్యాయమూర్తి బీవీ నాగరత్న కూడా ఉన్నారు. ఈమె 2027 సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు.
మిగిలిన వారిలో బేలా ఎం త్రివేది, హిమకోహ్లీ, సీటీ రవికుమార్, ఎంఎం సుందరేశ్, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ, అభయ్ శ్రీనివాస్ ఓక, విక్రమ్నాథ్, జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపుగా రెండేళ్ల తరువాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం జరిగింది. సెప్టెంబర్ 2019లో జడ్జీల నియామకం తరువాత 2021లో వీరి నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కేవలం 24 మంది న్యాయమూర్తులే సేవలు అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం 9 మంది నియామకాలతో నిర్ధేశిత 34 మంది న్యాయమూర్తులకు ఒక్క స్థానం తక్కువగా న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more