తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలో పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరస్థుడు.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తరహాలో పార్థసారధి కూడా బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఉద్దేశపూర్వకంగా వాటిని తిరిగి చెల్లించలేదని ఆరోపణల నేపథ్యంలో ఆయనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులను తప్పుదోవ పట్టించి తాను తీసుకున్న రుణాలను అక్రమంగా వాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్వీ సంస్థ పేరున రుణాలను పోందిన ఆయన వాటిని ఎగవేసేందుకు యత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోందిన రుణాలను సకాలంలో నెలవారి వాయిదాలు చెల్లించకపోవడంతో హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకుల అధికారులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పార్థసారధి హెచ్డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రూ. 650 కోట్ల రుణంతో పాటు ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ.137 కోట్ల మేర రుణం తీసుకుందని సమాచారం. కాగా, రుణాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలియవచ్చింది.
కార్వీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పార్ధసారధి మొత్తంగా బ్యాంకుల నుంచి రూ.780 కోట్ల మేరకు రుణాలు పొందిన తరువాత వాటిని బ్యాంకు అవసరాలకు కాకుండా ఇతరాత్రలకు వినియోగించినట్లు సమాచారం. దీంతో నిధుల మళ్లింపు విషయమై బ్యాంకు అధికారులు పోలీసులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులకు కార్వీ సంస్థలోని కస్టమర్లకు చెందిన నిధులు కూడా దారిమళ్లిన విషయం తెలుసుకున్నారు. రూ.720 కోట్ల కస్టమర్ల నిధులను కూడా తారుమారు చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇంతకుముందు షేర్ల అక్రమ లావాదేవీలకు పాల్పడినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. గతంలో కార్వీపై నిషేధం విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more