సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF)తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్ ధర రూ.750 ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఏప్రిల్ 12న అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందింది. ప్రస్తుతం వ్యాక్సిన్ 65 దేశంలో వినియోగిస్తున్నారు. భారత్లో మేలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను మాస్కోలోని గమలేయా ఇన్స్టిట్యూట్ అండ్ రష్యన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
పరాగ్వేలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్డీఐఎఫ్ బుధవారం తెలిపింది. రష్యాలో మే వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అధికారం పొందిన సమయంలో 79.4 శాతం సామర్థ్యాన్ని చూపిందని ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 11 ఆగస్ట్, 2021న రష్యా ఆమోదించగా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన మొదటి కొవిడ్ వ్యాక్సిన్గా నిలిచింది. టీకా అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్ఫారమ్లో టీకాను తయారు చేశారు. వ్యాక్సిన్ 97.5శాతం ప్రభావంతంగా పని చేస్తుందని మేలో ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. మెడికల్ జర్నల్ లాన్సెట్ సైతం స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తెలిపింది.
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ట్రయల్స్ రష్యా, యూఏఈ, ఘనాతో పాటు ఏడు దేశాల్లో జరిగాయి. కొవిడ్ అన్ని వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావంతంగా పని చేస్తుందని గమలేయా సెంటర్ తెలిపింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండు డోసుల టీకా కాగా.. లైట్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ టీకా. వ్యాక్సిన్ ప్రభావం రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. సింగిల్ డోస్ కావడంతో టీకాలు వేసేందుకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్ మాట్లాడుతూ సమర్థవంతమైన డేటాతో వ్యాక్సిన్ను ఆమోదిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.
ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు సహాయకరంగా ఉంటుందన్నారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ దీర్ఘకాలిక ప్రభావం కోసం వాస్తవ ఫలితాలను చూడాలన్నారు. ఇదిలా ఉండగా.. డ్రగ్ రెగ్యులేటర్ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ రష్యాలో నిర్వహించిన ట్రయల్స్ డేటాను సమర్పించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో స్పుత్నిక్ లైట్ అనుమతి కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. భారత్లో ఏటా వంద మిలియన్ డోసుల స్పుత్నిక్ వీ తయారు చేయాలని లక్ష్యం కాగా.. డాక్టర్ రెడ్డీస్ ఆర్డీఐఎఫ్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more