మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓ వైపు అరెస్టు పర్వం కొనసాగిస్తున్న సీబీఐ.. మరోవైపు కేసులో వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణ వేగవంతం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. రహస్యంగా ఆయుధాల కోసం వేట కొనసాగించిన సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రానికి ఈ పనిపూర్తిచేశారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రొద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది.
సోదాల సందర్భంగా ఇంట్లో అవసరాలకు వాడే కొన్నిరకాల వస్తువులు, వ్యవసాయ పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా రోటరీపురం, గారండాల వాగు దగ్గర 26 మంది మున్సిపల్ సిబ్బందితో మూడు రోజుల పాటు ఆయుధాల కోసం తవ్వకాలు జరపగా జాడ దొరకలేదని అన్వేషణ ఆపేసినట్లుగా ప్రకటించారు. కానీ.. అనూహ్యంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం హైడ్రామాగా మారింది. దీంతో పాటు కర్ణాటక నుంచి 20 మంది బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కడపకు వచ్చి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివేకా హత్యకేసుకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోండగా ఈ కోణంలోనే ఇప్పటికే బలమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వ్యవసాయానికి వాడే కత్తులు, కొడవళ్ళను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా కూడా వెంట తీసుకెళ్లగా పంచనామా నిర్వహించి, సునీల్ తండ్రికి వస్తువుల జాబితా అందజేశారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలో కూడా తనిఖీలు చేయగా అక్కడ నుండి కూడా కొన్ని పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more