మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ కు కడప జిల్లాలోని పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రెండేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దాదాపుగా 50 రోజుల పాటు సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. కాగా సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్టులో సిబిఐ అధికారులు కీలక అంశాలను పోందుపర్చారు. వివేకా హత్యకేసులో సునీల్ యాదవ్ పాత్రపై కీలక అధారాలు లభించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కోనింది సీబిఐ.
వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయన్న వార్తల నేపథ్యంలో అదృశ్యమైన సునీల్ యాదవ్ గోవాకు పారిపోగా.. అక్కడే అతన్ని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై పులివెందులక తరలించి.. ఇక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చింది సీబిఐ. వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలం మేరకు సునీల్ యాదవ్ ను సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరముందని భావించామని, అయితే విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని పారిపోయాడని సీబిఐ రిమాండ్ రిపోర్టులో పేర్కోంది.
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కుట్రకోణం వివరాలు బహిర్గతం చేయడం లేదని…అడిగిన ప్రశ్నలకు అతను సహకరించడం లేదని చెప్తోంది సీబీఐ. వివేకా హత్యకేసుకు ముందు, తరువాత సునీల్ యాదవ్ కదలికలు అనుమానాస్పదంగా వున్నాయని పేర్కోంది.ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపినట్టు సమాచారం. హత్యకు వాడిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ చెప్తోంది. సునీల్ యాదవ్ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని అందుకే 13రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.
వీరితో పాటు సునీల్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రిలను సీబిఐ కర్నాటకలో అదుపులోకి తీసుకుంది. అయితే సీబిఐ అధికారుల వేధింపులు తట్టుకోలేక పారిపోయినట్టు వీరు చెబుతున్నారు. సీబిఐ తమను వేధిస్తోందని, కడప జైళ్లో పెట్టి తమను 20 రోజుల పాటు తీవ్రంగా కొట్టారని న్యాయస్థానంలో తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని.. ఏ పని చేసుకోనీయకుండా తమను నిరంతరం చిత్రహింసలకు గురిచేస్తున్నారని అరోపించారు. అందుకనే సీబిఐ నుంచి తప్పించుకుని తిరుగుతున్నామని వారు న్యాయస్థానంలో చెప్పినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more